Avengers Doomsday: 12 గంటల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అవెంజర్స్ డూమ్స్‌డే రికార్డుల ఊచకోత

Avengers Doomsday: అవెంజర్స్ డూమ్స్‌డే మూవీ రిలీజ్ కు మరో ఐదు నెలల ముందే రికార్డుల ఊచకోత మొదలుపెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన 12 గంటల్లోనే ఏకంగా 10 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేయడం విశేషం.

Published on: Jul 21, 2026, 15:48:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Avengers Doomsday: 'అవెంజర్స్: డూమ్స్‌డే' (Avengers: Doomsday) అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 12 గంటల్లోనే 10.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 100 కోట్లు) రాబట్టి బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వస్తున్న ఈ హై-వోల్టేజ్ మూవీ ట్రైలర్ రిలీజైన వెంటనే ప్రీ-సేల్స్‌లో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డులను సెట్ చేసింది. రిలీజ్‌కు ఇంకా ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో టికెట్లు అమ్ముడవ్వడం గ్లోబల్ సినిమా వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

Avengers Doomsday: 12 గంటల్లోనే రూ.95 కోట్ల వసూళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అవెంజర్స్ డూమ్స్‌డే రికార్డుల ఊచకోత
Avengers Doomsday: 12 గంటల్లోనే రూ.95 కోట్ల వసూళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అవెంజర్స్ డూమ్స్‌డే రికార్డుల ఊచకోత

ఇన్ఫినిటీ విజన్ ఫార్మాట్‌లో సంచలనం

అమెరికా వ్యాప్తంగా కేవలం 10 శాతం థియేటర్లలో, అదీ డిస్నీ కొత్తగా పరిచయం చేసిన 'ఇన్ఫినిటీ విజన్' (Infinity Vision) లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌లో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఐమాక్స్ (IMAX) స్క్రీన్లకు పోటీగా డిస్నీ సొంతంగా డెవలప్ చేసిన ఈ స్పెషల్ ఫార్మాట్‌కు హాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఈ ఏడాది డిసెంబర్‌లో రాబోతున్న 'డ్యూన్ పార్ట్ 3' (Dune: Part III) మూవీకి మెజారిటీ ఐమాక్స్ స్క్రీన్లు దక్కడంతో డిస్నీ ఈ పక్కా మాస్టర్‌ప్లాన్ అమలు చేసింది. కేవలం 10 శాతం అందుబాటులో ఉన్న సీట్లకే ఆడియన్స్ ఈ రేంజ్ లో ఎగబడటంతో ట్రేడ్ విశ్లేషకులు మైండ్ బ్లాక్ అవుతున్నారు.

రాబర్ట్ డౌనీ జూనియర్ రీఎంట్రీ.. రూసో బ్రదర్స్ మ్యాజిక్

ఒకప్పుడు ఐరన్ మ్యాన్‌గా మార్వెల్ ఫ్రాంచైజీకి వెన్నెముకగా నిలిచిన రాబర్ట్ డౌనీ జూనియర్ (RDJ) ఈ సినిమాలో మోస్ట్ డేంజరస్ విలన్ 'డాక్టర్ డూమ్' క్యారెక్టర్‌లో రీఎంట్రీ ఇస్తున్నారు. హీరోగా అలరించిన స్టార్ నటుడు ఇప్పుడు విలన్‌గా రాబోతుండటంతో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయింది.

దీనికి తోడు మార్వెల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అయిన 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్', 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' చిత్రాలను డైరెక్ట్ చేసిన రూసో బ్రదర్స్ (Russo Brothers) మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎంసీయూకి కొత్త ఊపిరి.. హాలీవుడ్ సూపర్ స్టార్స్ హంగామా

2019 లో వచ్చిన 'ఎండ్‌గేమ్' తర్వాత మార్వెల్ మేకర్స్ వరుస ప్లాప్‌లతో కాస్త ఒత్తిడిలో పడిన మాట నిజమే. 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్', 'డెడ్‌పూల్ & వోల్వరిన్' లాంటి కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయినా, మిగతా ప్రాజెక్టులు ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాయి.

ఇప్పుడు 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీ ద్వారా మళ్లీ పాత వైభవాన్ని తెచ్చుకోవాలని మార్వెల్ ప్రొడక్షన్స్ భావిస్తోంది. ఈ సినిమాలో క్రిస్ హెమ్స్‌వర్త్ (థోర్), క్రిస్ ఎవాన్స్ (కెప్టెన్ అమెరికా), పెడ్రో పాస్కల్, ఆంథోనీ మేకీ, పాల్ రడ్ లాంటి టాప్ హాలీవుడ్ నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

ఈ మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ప్రాజెక్ట్ డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అదే రోజున భారీ అంచనాలతో వస్తున్న 'డ్యూన్ 3' తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నేరుగా పోటీ పడనుంది.

మునుపెన్నడూ లేని విధంగా 5 నెలల ముందే మొదలైన ఈ వినాశకరమైన అడ్వాన్స్ బుకింగ్స్ రన్ చూస్తుంటే, మొదటి రోజునే ఆల్‌టైమ్ హాలీవుడ్ ఓపెనింగ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More