...
...
Next Story

ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ ట్రెండింగ్‌లో భగవంత్ కేసరి.. విజయ్ జన నాయగన్ రిలీజ్‌కు ముందు అనూహ్యంగా..

దళపతి విజయ్ జన నాయగన్ రిలీజ్ కు ముందు ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది భగవంత్ కేసరి. విజయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అందరూ ఆ మూవీ స్టోరీ అచ్చూ ఈ బాలయ్య మూవీలాగే ఉందని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Published on: Jan 5, 2026, 17:57:38 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. ఇది బాలకృష్ణ హిట్ సినిమా 'భగవంత్ కేసరి' రీమేక్ అనే అనుమానాలు బలపడ్డాయి. దీంతో జనాలు అసలు కథ ఏంటో తెలుసుకోవడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'భగవంత్ కేసరి'ని ఎగబడి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

అమెజాన్ ప్రైమ్‌లో 'భగవంత్ కేసరి' హవా

ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ ట్రెండింగ్‌లో భగవంత్ కేసరి.. విజయ్ జన నాయగన్ రిలీజ్‌కు ముందు అనూహ్యంగా..
ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ ట్రెండింగ్‌లో భగవంత్ కేసరి.. విజయ్ జన నాయగన్ రిలీజ్‌కు ముందు అనూహ్యంగా..

జనవరి 9న థియేటర్లలోకి వస్తున్న 'జన నాయగన్' సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇది బాలయ్య సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అని ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. ట్రైలర్ చూసాక అవి నిజమే అనిపిస్తుండటంతో.. నెటిజన్లు కంపారిజన్ మొదలుపెట్టారు.

విజయ్ సినిమా క్రేజ్ వల్ల బాలయ్య సినిమాకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ పెరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డ్రామా మూవీస్ కేటగిరీలో 'భగవంత్ కేసరి' ప్రస్తుతం ఒకటో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా.. ఒక మాజీ ఖైదీ తన దత్తపుత్రికను ఆర్మీలో చేర్పించడానికి పడే తపన, మధ్యలో ఒక బిజినెస్ మ్యాన్‌తో గొడవ చుట్టూ తిరుగుతుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి రియాక్షన్

తన సంక్రాంతి సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు' ప్రెస్ మీట్‌లో.. డైరెక్టర్ అనిల్ రావిపూడిని "విజయ్ సినిమా మీ సినిమాకు రీమేకా?" అని అడగగా అతడు స్పష్టంగా సమాధానం చెప్పలేదు.

జన నాయగన్ సినిమాలో దళపతి విజయ్, మమితా బైజు (శ్రీలీల పాత్రలో నటిస్తున్నట్లు టాక్), పూజా హెగ్డే, బాబీ డియోల్ లాంటి వాళ్లు నటించారు. తెలుగులో 'జన నాయకుడు' పేరుతో, హిందీలో 'జన్ నేత' పేరుతో రిలీజ్ అవుతోంది.

విజయ్ తన పార్టీ 'టీవీకే' ద్వారా రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న ఆఖరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. బుక్‌మైషోలో మాత్రం దీని లైన్ "అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఎదిగే నిజమైన నాయకుడు" అని రాసి ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe