రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన జోడీ ఇది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కలిసి నటించిన ఈ జంట లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఒక దశలో వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ జంట మౌనంగా ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా ఈవెంట్లో రామ్ గురించి భాగ్యశ్రీ మాటలు వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అభిమానులను నమ్మేలా చేసింది.
కింగ్ ఆఫ్ హార్ట్స్

‘‘రామ్ పోతినేనికి ప్రేమంతా దక్కాలి. తమ అభిమానులను అంతగా ప్రేమించే వ్యక్తి ఎవరో, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి ఎవరో, వారికోసం సినిమా తీసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ ఒక్కరే.. ఏమంటారు? కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు. అతనే రామ్’’ అని భాగ్యశ్రీ తన మాటలతో రామ్ పై ప్రేమ కురిపించేసింది. భాగ్యశ్రీ ఇలా చెబుతుంటే రామ్ ఆశ్చర్యపోయి, నవ్వుతో ముఖం ఎర్రబడటం ఆపలేకపోయాడు.
లవ్యూ రామ్
‘‘ఈరోజు అంతా ఆయన గురించే, మన గురించి కాదు, ఇంకెవరి గురించి కాదు. అంతా రామ్ పోతినేని గురించే, ఎందుకంటే మీరు ఇక్కడ దక్కించుకోవాల్సిన ప్రేమంతా మీకు దక్కాలి. ధన్యవాదాలు రామ్, మీరు బెస్ట్. ఈ ప్రేమంతా మీకు దక్కాలి. మీ విజయం, అపజయం.. మీరు టాప్లో ఉన్నా, మాతో ఇక్కడ ఉన్నా, మాకు మీరు ఎప్పుడూ పైనే ఉంటారు. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. వి లవ్యూ రామ్’’ అని భాగ్యశ్రీ పేర్కొంది.
ప్రేమ ఉందని
భాగ్యశ్రీ స్పీచ్, దానికి రామ్ రియాక్షన్ తో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని అభిమానులు నమ్ముతున్నారు. అనేక మంది ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ యూజర్లు భాగ్యశ్రీ స్పీచ్ క్లిప్ను షేర్ చేస్తూ, తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నారు.. 'రీల్ లైఫ్లో, నిజ జీవితంలో కూడా మంచి జోడీ' అని పేర్కొన్నాడు. 'ఇంటి పేరు అన్నిసార్లు చెప్పిందంటే పుకార్లను బట్టి చూస్తే ప్రేమ గాలిలో ఉందనిపిస్తోంది' అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
భాగీ పోతినేని
'ప్రేమ గాలిలో ఉంది అనిపిస్తుంది', 'భార్య భర్తను సమర్థిస్తోంది', 'భాగీ పోతినేని' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు అభిమానులు ఏమో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల మాదిరిగానే భాగ్యశ్రీ, రామ్ కూడా తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచుతున్నారని భావించారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి మహేష్ బాబు పచిగొళ్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్, భాగ్యశ్రీలతో పాటు నిమ్మా ఉపేంద్ర కూడా నటించారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
{{/usCountry}}'ప్రేమ గాలిలో ఉంది అనిపిస్తుంది', 'భార్య భర్తను సమర్థిస్తోంది', 'భాగీ పోతినేని' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు అభిమానులు ఏమో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల మాదిరిగానే భాగ్యశ్రీ, రామ్ కూడా తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచుతున్నారని భావించారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి మహేష్ బాబు పచిగొళ్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్, భాగ్యశ్రీలతో పాటు నిమ్మా ఉపేంద్ర కూడా నటించారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
{{/usCountry}}