పొలిటికల్ పార్టీ స్థాపించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ తన కెరీర్ లో చేసిన లాస్ట్ మూవీ ‘జన నాయగన్’. ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. జన నాయగన్ విషయంలో దళపతి విజయ్ కు మరోసారి కోర్టు షాకిచ్చింది. సింగిల్ బెంగ్ తీర్పును కొట్టేసిన హై కోర్టు డివిజన్ బెంచ్ మరోసారి సింగిల్ బెంచ్ లోనే సెన్సార్ బోర్డు ఇష్యూను తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
జన నాయగన్ పై కోర్టు తీర్పు

జన నాయగన్, సెన్సార్ సర్టిఫికేట్ వివాదంపై ఇవాళ (జనవరి 27) మద్రాస్ హై కోర్టు తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఎంఎం శర్వాశ్రీ, జస్టిస్ జి. అరుణ్ మురుగన్ నేతృత్వంలోని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), 'జన నాయగన్' నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ మధ్య కేసును సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
మంగళవారం మద్రాస్ హై కోర్టులో జన నాయగన్, సెన్సార్ బోర్డు కేసు విచారణ జరిగింది. ఫిర్యాదులో లేవనెత్తిన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జన నాయగన్ కు అనుకూలంగా సింగిల్ (ఏకసభ్య) బెంచ్ లో జరిగిన విచారణలో తమ వాదనలు వినిపించడానికి సెన్సార్ బోర్డుకు సమయం ఇవ్వాల్సిందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.
సింగిల్ బెంచ్ కు
సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ లేదని కూడా కోర్టు గమనించింది. దానిని సవాలు చేయాలని నిర్మాతను కోరింది. జన నాయగన్ కు సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. కొత్తగా పరిశీలించడానికి మళ్లీ సింగిల్ బెంచ్ కే కేసును రికమండ్ చేసింది.
ఏం జరిగిందంటే?
సెన్సార్ బోర్డు పరిశీలనా కమిటీ డిసెంబర్, 2025లో జన నాయగన్ సినిమా చూసింది. 14 కట్స్ తర్వాత UA 16+ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పిందని నిర్మాతలు పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు కట్స్ తో అంగీకరించినప్పటికీ, జనవరి 5 వరకు సెన్సార్ బోర్డు నుండి వారికి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో వాళ్లు మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. దీంతో సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును సింగిల్ బెంచ్ డివిజన్ ఆదేశించింది.
{{/usCountry}}సెన్సార్ బోర్డు పరిశీలనా కమిటీ డిసెంబర్, 2025లో జన నాయగన్ సినిమా చూసింది. 14 కట్స్ తర్వాత UA 16+ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పిందని నిర్మాతలు పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు కట్స్ తో అంగీకరించినప్పటికీ, జనవరి 5 వరకు సెన్సార్ బోర్డు నుండి వారికి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో వాళ్లు మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. దీంతో సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును సింగిల్ బెంచ్ డివిజన్ ఆదేశించింది.
{{/usCountry}}దీనిపై సెన్సార్ బోర్డు మద్రాస్ హై కోర్టు డిజిటన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. మళ్లీ సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని చెప్పింది.
జన నాయగన్ గురించి
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన కెరీర్ లో చేసిన లాస్ట్ మూవీ జన నాయగన్. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు కేసు ఇంకా కొనసాగుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్, పూజా హెగ్డే తదితరులు కూడా నటించారు.