Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్బాస్' పదో సీజన్కు ముస్తాబవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్మార్క్ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని టాక్. ఈ నేపథ్యంలో హౌస్లోకి అడుగుపెట్టే సెలబ్రిటీల జాబితాపై రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బిగ్ బాస్ 10 తెలుగు

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ తో ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో రిలీజైన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో స్టార్ కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్, నరేష్ (పొట్టి నరేష్) కనిపించకపోవడంతో వీరు బిగ్బాస్ 10 హౌస్లోకి వెళ్లడం దాదాపు ఖాయమైందని ప్రచారం ఊపందుకుంది.
జబర్దస్త్ ప్రోమో తెచ్చిన అనుమానాలు
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కొత్త ప్రోమో విడుదలైంది. ఎప్పుడూ తన పంచ్లతో నవ్వించే ఆటో రామ్ ప్రసాద్, తనదైన కామెడీతో అలరించే పొట్టి నరేష్ ఈ లేటెస్ట్ ప్రోమోలో ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా బిగ్బాస్ హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్లు షో ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తమ మిగతా ప్రాజెక్టుల షూటింగ్స్కు బ్రేక్ ఇస్తారు. ఇప్పుడు రామ్ ప్రసాద్, నరేష్ కూడా అదే కారణంతో జబర్దస్త్ షూటింగ్కు దూరంగా ఉన్నారని బుల్లితెర వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
బిగ్బాస్ సెంటిమెంట్
బిగ్బాస్ షోలో కేవలం గొడవలు, టాస్క్లు మాత్రమే కాకుండా ప్రేక్షకులు వినోదాన్ని కూడా కోరుకుంటారు. అందుకే మేకర్స్ ప్రతి సీజన్లోనూ జబర్దస్త్ కమెడియన్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గతంలో ముక్కు అవినాష్, రోహిణి, ఇమ్మాన్యుయేల్, ఫైమా వంటి నటులు బిగ్బాస్ హౌస్లో సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి పదో సీజన్ కావడంతో ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచేందుకు రామ్ ప్రసాద్ను ముందుగానే ఖరారు చేశారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు నరేష్ కూడా జతకలిశాడనే వార్త ఆసక్తి కలిగిస్తోంది.
టైమింగ్ కింగ్ రామ్ ప్రసాద్
{{/usCountry}}బిగ్బాస్ షోలో కేవలం గొడవలు, టాస్క్లు మాత్రమే కాకుండా ప్రేక్షకులు వినోదాన్ని కూడా కోరుకుంటారు. అందుకే మేకర్స్ ప్రతి సీజన్లోనూ జబర్దస్త్ కమెడియన్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గతంలో ముక్కు అవినాష్, రోహిణి, ఇమ్మాన్యుయేల్, ఫైమా వంటి నటులు బిగ్బాస్ హౌస్లో సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి పదో సీజన్ కావడంతో ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచేందుకు రామ్ ప్రసాద్ను ముందుగానే ఖరారు చేశారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు నరేష్ కూడా జతకలిశాడనే వార్త ఆసక్తి కలిగిస్తోంది.
టైమింగ్ కింగ్ రామ్ ప్రసాద్
{{/usCountry}}ఆటో రామ్ ప్రసాద్ తన ఆటో పంచ్లతో, నవ్వించే రైటింగ్ తో బుల్లితెరపై చెరగని ముద్ర వేశారు. మరోవైపు గుంటూరుకు చెందిన పొట్టి నరేష్ శారీరక లోపాన్ని, సమాజం నుంచి ఎదురైన ఛీత్కారాలను జయించి జబర్దస్త్ వేదికపై నిలబడ్డారు. తన పట్టుదలతో టీమ్ లీడర్గా ఎదిగి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఈ ఇద్దరు పక్కా కామెడీ టైమింగ్ ఉన్న నటులు బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెడితే ప్రేక్షకులకు వినోదం పంచడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.