మరాఠీ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, రన్నరప్ జై దుధానే చిక్కుల్లో పడ్డారు. ఒక రియల్ ఎస్టేట్ స్కామ్కు సంబంధించి థానే పోలీసులు ఆయనను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో కలిసి హనీమూన్కు విదేశాలకు వెళ్తున్న తరుణంలో ఈ అరెస్ట్ జరగడం సంచలనం సృష్టించింది.
హనీమూన్ ట్రిప్లో ఊహించని మలుపు

తన అరెస్టుపై జై దుధానే స్పందిస్తూ.. "నేను నా భార్య, సోదరుడు, వదినతో కలిసి హనీమూన్ కోసం విదేశాలకు వెళ్తున్నాను. నాపై లుకౌట్ నోటీసులు ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలియదు. పోలీసులు నన్ను అడ్డుకుని, దేశం విడిచి వెళ్లకూడదని చెప్పారు. నేను వారికి పూర్తిగా సహకరిస్తున్నాను" అని తెలిపారు.
పోలీసు వ్యానులో కూర్చుని మీడియాతో మాట్లాడిన జై దుధానే.. ముఖానికి మాస్క్ వేసుకోవడానికి కూడా నిరాకరించారు. "నేను తప్పు చేయలేదు, అలాంటప్పుడు భయపడి ముఖం దాచుకోవాల్సిన అవసరం లేదు" అని ధీమా వ్యక్తం చేశారు.
ఏమిటా రూ. 4.61 కోట్ల ఆరోపణలు?
ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జై, అతని నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. థానేలో ఇప్పటికే బ్యాంకులో తాకట్టు పెట్టిన ఐదు కమర్షియల్ షాపులను తమకు అమ్మి మోసం చేశారని బాధితుడు ఆరోపించారు.
ఒకే షాపును పలువురికి అమ్మారన్న వార్తలపై జై స్పందిస్తూ.. "ఒకసారి అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఒకే ఆస్తిని పదిమందికి అమ్మడం అసాధ్యం. ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే చూపమనండి. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోంది" అని కొట్టిపారేశారు.
చట్టంపై నమ్మకం ఉంది
భారతీయ న్యాయ సంహిత (BNS) కింద మోసం, ఫోర్జరీ కేసులను ఎదుర్కొంటున్న జై.. చట్టం ముందు నిజం గెలుస్తుందని పేర్కొన్నారు. "ఈ వ్యవహారాన్ని చాలా నీచంగా వక్రీకరించారు. నేను దేనికీ భయపడను, పోలీసుల విచారణకు సిద్ధంగా ఉన్నాను" అని జై స్పష్టం చేశారు.
కెరీర్ విశేషాలు
{{/usCountry}}భారతీయ న్యాయ సంహిత (BNS) కింద మోసం, ఫోర్జరీ కేసులను ఎదుర్కొంటున్న జై.. చట్టం ముందు నిజం గెలుస్తుందని పేర్కొన్నారు. "ఈ వ్యవహారాన్ని చాలా నీచంగా వక్రీకరించారు. నేను దేనికీ భయపడను, పోలీసుల విచారణకు సిద్ధంగా ఉన్నాను" అని జై స్పష్టం చేశారు.
కెరీర్ విశేషాలు
{{/usCountry}}జై దుధానే మోడల్గా, ఫిట్నెస్ ట్రైనర్గా కెరీర్ ప్రారంభించారు. 2021లో 'స్ల్పిట్స్ విల్లా' విన్నర్గా నిలిచిన జై దుధానే ఆ తర్వాత 'బిగ్ బాస్ మరాఠీ సీజన్ 3'లో రన్నరప్గా నిలిచి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే.. గత ఏడాది డిసెంబర్లో తన చిరకాల ప్రేయసి హర్షల పాటిల్ను వివాహం చేసుకున్నారు జై దుధానే. పెళ్లయిన కొద్దిరోజులకే ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.