దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక అమానవీయ ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం ఆరేళ్ల వయసున్న ఒక పసి ప్రాణంపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడటం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఈ దారుణ ఉదంతంపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు.
మన సమాజం ఎటు వెళ్తోంది?

బుధవారం (జనవరి 28) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఘటనకు సంబంధించిన వార్తను షేర్ చేస్తూ భూమి పెడ్నేకర్ తన ఆవేదనను వెళ్లగక్కారు. "అసలు ఏం జరుగుతోంది? లైంగిక వేధింపులకు పాల్పడినా సులభంగా తప్పించుకోవచ్చని భావిస్తున్న ఇలాంటి రాక్షసుల్లో భయాన్ని కలిగించలేకపోతున్నామంటే.. మనం కచ్చితంగా విఫలమైనట్టే" అని భూమి ఘాటుగా విమర్శించారు. నేరస్థుల్లో చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు పునరావృతమవుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
వీధి కుక్కల కంటే క్రూరంగా..
దేశంలో వీధి కుక్కల వల్ల ముప్పు పొంచి ఉందంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతామని, వాటిని హింసిస్తామని.. కానీ అంతకంటే ఘోరమైన వాస్తవాలను మాత్రం పట్టించుకోమని, వీధి కుక్కల కంటే క్రూరంగా ప్రవర్తించే వారి గురించి మాట్లాడమని భూమి ఎత్తి చూపారు.
"మన దేశంలో మూగజీవాలను శిక్షించడానికి చూపిస్తున్న ఆసక్తి, ఆరేళ్ల చిన్నారికి రక్షణ కల్పించడంలో చూపించలేకపోతున్నాం. మైనర్ బాలురు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారంటే.. వారు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారో ఆలోచించండి. 'వేక్ అప్ ఇండియా'.. మన వీధుల్లో మన పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది" అంటూ భూమి పెడ్నేకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఏం జరిగింది?
ఈశాన్య ఢిల్లీలోని భజన్పురాలో జనవరి 18న ఈ దారుణం చోటుచేసుకుంది. చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 7 గంటల సమయంలో తండ్రి ఆమెకు చాక్లెట్ కొనిపించి గల్లీ చివరిలో వదిలి వెళ్లారు. అప్పుడే ముగ్గురు బాలురు (వయసు 10, 13, 14 ఏళ్లు) బాలికకు చౌమిన్ తినిపిస్తామని ఆశ చూపి, సమీపంలోని ఒక ఖాళీ భవనంలోకి తీసుకెళ్లారు.
{{/usCountry}}ఈశాన్య ఢిల్లీలోని భజన్పురాలో జనవరి 18న ఈ దారుణం చోటుచేసుకుంది. చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 7 గంటల సమయంలో తండ్రి ఆమెకు చాక్లెట్ కొనిపించి గల్లీ చివరిలో వదిలి వెళ్లారు. అప్పుడే ముగ్గురు బాలురు (వయసు 10, 13, 14 ఏళ్లు) బాలికకు చౌమిన్ తినిపిస్తామని ఆశ చూపి, సమీపంలోని ఒక ఖాళీ భవనంలోకి తీసుకెళ్లారు.
{{/usCountry}}అక్కడ చిన్నారి నోట్లో బట్టలు కుక్కి, చేతులు కట్టేసి సాముహిక అత్యాచారానికి ఒడిగట్టారు. రక్తపు మడుగులో ఇంటికి వచ్చిన చిన్నారిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో బాలుడు తన కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడు.
భూమి పోస్ట్ వైరల్
డీసీపీ ఆశిష్ మిశ్రా ఈ కేసుపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని ధృవీకరించారు. మరోవైపు భూమి పెడ్నేకర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలు, బాలికల భద్రతపై మరోసారి గళం ఎత్తాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.