'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్ తప్పుకోవడానికి పని గంటలే కారణమన్న చర్చ టాలీవుడ్, బాలీవుడ్లో జోరుగా సాగుతోంది. దీనిపై తాజాగా సీనియర్ నటి మాధురీ దీక్షిత్ స్పందించింది. తాను 'వర్క్హాలిక్' అని, తన వెబ్ సిరీస్ కోసం 12 గంటలు పనిచేశానని చెబుతూనే, దీపికా నిర్ణయాన్ని సమర్థించేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దీపిక డిమాండ్పై మాధురి ఇలా..

సందీప్ రెడ్డి వంగా ప్రతిష్టాత్మక మూవీ 'స్పిరిట్' (Spirit), నాగ్ అశ్విన్ భారీ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తప్పుకోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఆమె కేవలం 8 గంటల షిఫ్ట్ మాత్రమే చేస్తానని కోరడమే ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి సినీ పరిశ్రమలో పనివేళల గురించి వాడివేడి చర్చ నడుస్తోంది. తాజాగా ఈ డిబేట్లోకి సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ఎంట్రీ ఇచ్చింది.
ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ మాధురీ దీక్షిత్ తన పని తీరు గురించి, అలాగే నటీమణుల హక్కుల గురించి మాట్లాడింది. "విషయం ఏంటంటే.. మేము 'మిసెస్ దేశ్పాండే' చేస్తున్నప్పుడు ప్రతిరోజూ 12 గంటల షిఫ్ట్లు చేసేవాళ్ళం. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే ఉండేది. అయితే ఎవరి పద్ధతి వారిది. నేనొక వర్క్హాలిక్ని. కాబట్టి నా విషయం వేరు కావచ్చు. కానీ ఒక మహిళకు 'నేను ఇన్ని గంటలే పని చేస్తాను' అని చెప్పే శక్తి, అధికారం ఉంటే.. అది ఆమె ఇష్టం, ఆమె లైఫ్. ఆమె ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు. దానికి నా మద్దతు ఉంటుంది " అని మాధురీ చెప్పుకొచ్చింది.
అసలు వివాదం ఏంటి?
కేవలం 8 గంటల పనివేళలు కావాలని కోరడం వల్లే దీపికా పదుకోన్ 'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్ నుంచి తప్పుకుందని రిపోర్టులు వచ్చాయి. దీనిపై దీపికా గతంలో ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంది.
{{/usCountry}}కేవలం 8 గంటల పనివేళలు కావాలని కోరడం వల్లే దీపికా పదుకోన్ 'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్ నుంచి తప్పుకుందని రిపోర్టులు వచ్చాయి. దీనిపై దీపికా గతంలో ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంది.
{{/usCountry}}"పరిశ్రమలో చాలా మంది ప్రముఖ మేల్ స్టార్లు ఏళ్ల తరబడి 8 గంటల షిఫ్టులు చేస్తున్నారు. వారి గురించి ఎప్పుడూ వ్యతిరేక వార్తలు రాలేదు. ఒక స్త్రీగా నేను అడిగితే మాత్రం అది మొండితనం అనిపిస్తే.. అలాగే అనుకోనివ్వండి" అని ఆమె ఘాటుగా బదులిచ్చింది. సినిమా పరిశ్రమ బయటకి గ్లామరస్గా కనిపించినా, చాలా విషయాల్లో అస్తవ్యస్తంగా ఉంటుందని కూడా దీపికా పేర్కొంది.
'మిసెస్ దేశ్పాండే' గురించి..
నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ‘మిసెస్ దేశ్పాండే’.. ఫ్రెంచ్ థ్రిల్లర్ 'లా మాంటే' (La Mante) కు అధికారిక రీమేక్. ఒక కాపీక్యాట్ హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులకు సహాయం చేసే ఒక సీరియల్ కిల్లర్ (మాధురీ) కథ ఇది. అయితే తన కొడుకుతో మాత్రమే కలిసి పనిచేస్తానని ఆమె షరతు విధించడం, తద్వారా వారి మధ్య ఏర్పడే భావోద్వేగ సంఘర్షణ ఈ కథలో కీలకం. ఈ సిరీస్ డిసెంబర్ 19న జియోహాట్స్టార్ లో విడుదల కానుంది.