బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంటాయి. తాజాగా ఇంటి వాతావరణం, దంపతుల మధ్య ఉండాల్సిన సంబంధంపై రాణి ముఖర్జీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు తెరలేపాయి. భర్తలపై భార్యలు గొంతు పెంచి మాట్లాడాలని రాణి అనడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
అసలేం జరిగింది?

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రాణి ముఖర్జీ సమాజంలో లింగ సమానత్వం గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఒక బాలుడు తన తల్లిని తన తండ్రి ఎలా చూస్తున్నాడో గమనిస్తూ పెరుగుతాడని, తండ్రి ప్రవర్తనే కొడుకు వ్యక్తిత్వాన్ని మలుస్తుందని రాణి ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
గౌరవం ఇంటి నుంచే
"గౌరవం అనేది ఇంటి నుంచే మొదలవుతుంది. ఇంట్లో తల్లిని తండ్రి సరిగ్గా చూడకపోతే, బయట అమ్మాయిలను కూడా అలాగే చూడవచ్చని అబ్బాయిలు భావిస్తారు. కాబట్టి ఇంట్లో భార్యను గౌరవించే విషయంలో తండ్రులు బాధ్యతగా ఉండాలి. అప్పుడే సమాజంలో మహిళలకు దక్కాల్సిన హోదా ఏంటో అబ్బాయిలకు అర్థమవుతుంది" అని రాణి ముఖర్జీ పేర్కొన్నారు.
అయితే, ఇదే క్రమంలో రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. "భర్త తన భార్యపై అస్సలు గొంతు పెంచకూడదు. నిజానికి భార్యే భర్తపై గొంతు పెంచి మాట్లాడాలి.. అప్పుడే అంతా బాగుంటుంది" అని వ్యాఖ్యానించారు.
చెంపదెబ్బ కొట్టిన విషయం
అంతేకాకుండా తన స్కూల్ రోజుల్లో ఒక అబ్బాయిని చెంపదెబ్బ కొట్టిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. తన భర్త, ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను సరదాగా ఉద్దేశించి "ఇంట్లో ఆయనకు రోజూ ఏమౌతుందో అడగకండి" అంటూ నవ్వేశారు.
నెటిజన్ల ఆగ్రహం: ‘అరవడాన్ని ఎలా సమర్థిస్తారు?’
అయితే, రాణి ముఖర్జీ ఆ మాటలను సరదాగా అన్నప్పటికీ.. సంబంధాల్లో 'అరవడాన్ని' లేదా 'గొంతు పెంచడాన్ని' సాధారణంగా చెప్పడం నెటిజన్లకు నచ్చలేదు. రెడిట్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై రాణి ముఖర్జీపై విమర్శల వర్షం కురుస్తోంది.
{{/usCountry}}అయితే, రాణి ముఖర్జీ ఆ మాటలను సరదాగా అన్నప్పటికీ.. సంబంధాల్లో 'అరవడాన్ని' లేదా 'గొంతు పెంచడాన్ని' సాధారణంగా చెప్పడం నెటిజన్లకు నచ్చలేదు. రెడిట్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై రాణి ముఖర్జీపై విమర్శల వర్షం కురుస్తోంది.
{{/usCountry}}"ఆమె తనను తాను చాలా ఫన్నీ అనుకుంటుంది.. కానీ ఆమె మాటలు ఏమాత్రం నవ్వు తెప్పించడం లేదు" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, "ఏ బంధంలోనైనా ఒకరిపై ఒకరు అరవడం సరైన పద్ధతి కాదు. ప్రశాంతంగా మాట్లాడుకోవాలి కానీ ఇలా అరిచి గోల చేయడం ఏంటి?" అని మరో నెటిజన్ ప్రశ్నించారు. "ఆమె సీనియర్ నటి అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు" అంటూ విమర్శిస్తున్నారు.
‘మర్దానీ 3’ మూవీతో
ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాణీ ముఖర్జీ తన సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘మర్దానీ 3’ మూవీ విడుదలకు రెడీగా ఉంది. ఇందులో రాణి ముఖర్జీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్గా కనిపించనున్నారు.
మహిళలపై జరిగే నేరాలను అరికట్టే నేపథ్యంలో సాగే మర్దానీ 3 చిత్రం జనవరి 30న (అంటే రేపు) థియేటర్లలోకి రానుంది. అభిరాజ్ మిన్వాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాణి ముఖర్జీ భర్త ఆదిత్య చోప్రా నిర్మించారు.