‘ధూమ్’, ‘హంగామా’, ‘ఫిర్ హేరా ఫేరీ’ వంటి సూపర్ హిట్ సినిమాలతో 2000వ దశకంలో కుర్రకారు మనసు గెలుచుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ రిమీ సేన్. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ రిమీ సేన్ సినిమాలకు దూరంగా ఉంటూ, దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తున్నారు. తాజాగా ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న రిమీ సేన్ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ స్టార్ హీరోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటన రాకపోయినా వ్యూహంతో నెట్టుకొచ్చారు!

ఎవరైనా తమ పరిమితులను (Limitations) గుర్తించి పనిచేస్తే జీవితంలో చాలా దూరం వెళ్తారని రిమీ సేన్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంను రిమీ సేన్ ప్రస్తావించారు.
"కెరీర్ మొదట్లో జాన్ అబ్రహం ఒక మోడల్. అతనికి నటన అస్సలు తెలియదు. అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చినా ఆయన ఎప్పుడూ నోరు విప్పలేదు. తన నటన కంటే బాడీ, లుక్స్ హైలైట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. అందుకే ఎక్కువగా యాక్షన్ సినిమాలనే ఎంచుకున్నారు. ప్రజలు వేలెత్తి చూపకుండా ఉండేలా తన ప్లానింగ్ ఉండేది. అందుకే ఆయన్ని చాలా తెలివైన నటుడు అని అంటాను" అని రిమీ సేన్ వివరించారు.
మెల్లమెల్లగా నటన నేర్చుకున్నారు
ఒక్కసారి క్రేజ్ వచ్చాక, కెమెరా ముందు సమయం గడిపే కొద్దీ ఎవరైనా నటన నేర్చుకుంటారని రిమీ సేన్ అభిప్రాయపడ్డారు. "జాన్ అబ్రహం కూడా అలాగే చేశారు. పాపులారిటీ పెరిగిన తర్వాత మెల్లమెల్లగా యాక్టింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు" అని రిమీ సేన్ తెలిపారు.
"ఆయన (జాన్ అబ్రహం) ఒక స్ట్రాటజిక్ నటుడు మాత్రమే కాదు, ఇప్పుడు మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ప్రొడక్షన్ రంగంలోకి వెళ్లి ఎన్నో క్రెడిబిలిటీ ఉన్న హిట్ సినిమాలను అందించారు" అని రిమీ సేన్ ప్రశంసించారు.
'ధూమ్' మ్యాజిక్
కాగా, 2004లో సంజయ్ గాధ్వి దర్శకత్వంలో వచ్చిన 'ధూమ్' అప్పట్లో ఒక సంచలనం. ఇందులో అభిషేక్ బచ్చన్ భార్యగా రిమీ సేన్ నటించగా జాన్ అబ్రహం నెగెటివ్ రోల్లో అదరగొట్టారు. వైఆర్ఎఫ్ (YRF) బ్యానర్పై వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లో అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీకి పునాది వేసింది.
జాన్ అబ్రహం ప్రస్తుత చిత్రాలు
{{/usCountry}}కాగా, 2004లో సంజయ్ గాధ్వి దర్శకత్వంలో వచ్చిన 'ధూమ్' అప్పట్లో ఒక సంచలనం. ఇందులో అభిషేక్ బచ్చన్ భార్యగా రిమీ సేన్ నటించగా జాన్ అబ్రహం నెగెటివ్ రోల్లో అదరగొట్టారు. వైఆర్ఎఫ్ (YRF) బ్యానర్పై వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లో అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీకి పునాది వేసింది.
జాన్ అబ్రహం ప్రస్తుత చిత్రాలు
{{/usCountry}}జాన్ అబ్రహం చివరిగా ‘టెహ్రాన్’ (Tehran) అనే స్పై యాక్షన్ థ్రిల్లర్లో కనిపించారు. 2012లో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలపై జరిగిన దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో జాన్ అబ్రహం‘తారిఖ్’ (Tariq) అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
చిరంజీవి సినిమాలో
ఇదిలా ఉంటే రిమీ సేన్ తెలుగులో కూడా హీరోయిన్గా నటించారు. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా అందరివాడు యాక్ట్ చేసి గ్లామర్తో మెప్పించారు.