70 ఏళ్లలోనూ చిరంజీవి క్రేజ్- మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్ అదుర్స్- ప్రభాస్ రాజా సాబ్ కంటే 6 రెట్లు ఎక్కువ!
70 ఏళ్ల వయసులోనూ తన బాక్సాఫీస్ స్టామినా తగ్గలేదని మెగాస్టార్ చిరంజీవి నిరూపిస్తున్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం 5వ రోజున భారీ వసూళ్లు సాధించడమే కాకుండా, ఇప్పటికే వరల్డ్ వైడ్గా రూ. 226 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టిస్తోంది.
వయసు కేవలం అంకె మాత్రమేనని, మాస్ ఇమేజ్ విషయంలో తనకు సాటి ఎవరూ లేరని మెగాస్టార్ చిరంజీవి (70) మరోసారి చాటి చెప్పారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVPG) బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.
70 ఏళ్లలోనూ చిరంజీవి క్రేజ్- మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్ అదుర్స్- ప్రభాస్ రాజా సాబ్ కంటే 6 రెట్లు ఎక్కువ!
200 కోట్లు దాటి
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 226 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేసి రికార్డులు సృష్టిస్తోంది. అయితే, ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, ఈ యాక్షన్ కామెడీ చిత్రం 5వ రోజున ఇండియాలో ఏకంగా రూ. 19.5 కోట్ల షేర్ను సాధించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అదే రోజున ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ వసూళ్ల కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ. వీక్డేస్లో కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం మెగాస్టార్ మేనియాకు నిదర్శనం.
ఆరో రోజు కలెక్షన్స్
అలాగే, ఆరో రోజున మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఇండియాలో రూ. 18.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు సమాచారం. ఈ లెక్కన ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం భారతీయ నెట్ వసూళ్లు రూ. 139.85 కోట్లకు చేరాయి. రాబోయే వారాంతంలో ఈ సంఖ్య మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
థియేటర్ ఆక్యుపెన్సీ
ఇక జనవరి 17 అయిన ఆరో రోజున తెలుగు థియేటర్లలో మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఓవరాల్గా 61.07 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. దీనిలో ఉదయం షోలకు 40.17 శాతం, మధ్యాహ్నాం 62.38 శాతం, సాయంత్రం 72.15 శాతం, నైట్ షోలకు 69.85 శాతంగా ఆక్యుపెన్సీ ఉంది.
కథా నేపథ్యం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి ఒకప్పటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆపరేటివ్గా కనిపిస్తారు. నయనతారతో ప్రేమలో పడి, పూర్తిస్థాయి ఫ్యామిలీ మ్యాన్గా మారాలనుకునే క్రమంలో సాగే ఆయన ప్రయాణం ఆడియన్స్ను కడుపుబ్బ నవ్విస్తోంది.
ఇందులో విక్టరీ వెంకటేష్ చేసిన ఎక్స్టెండెడ్ క్యామియో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మన శంకర వరప్రసాద్ చిత్రాన్ని నిర్మించాయి.