దృశ్యం కథ చెప్పి నయనతారతో సినిమా ఓకే చేయించుకున్న మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి- గుడ్డి నమ్మకమంటూ!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జోడీగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదలై రూ. 120 కోట్లకుపైగా కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మూవీకి నయనతారను ఎలా ఒప్పించారో అనిల్ రావిపూడి చెప్పిన విషయం ఆసక్తిగా మారింది.

Published on: Jan 17, 2026 1:44 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరు స్టార్ హీరోలను ఒకటిగా చేసిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చిరు, వెంకీ ఇద్దరిని ఒకే స్క్రీన్‌పై చూడాలని తహతహలాడిన ఇరు అభిమానుల కలను నిజం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.

దృశ్యం కథ చెప్పి నయనతారతో సినిమా ఓకే చేయించుకున్న మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి- గుడ్డి నమ్మకమంటూ!
దృశ్యం కథ చెప్పి నయనతారతో సినిమా ఓకే చేయించుకున్న మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి- గుడ్డి నమ్మకమంటూ!

మరో సంక్రాంతి సినిమా

ఇప్పటివరకు బాక్సాఫీస్ పరంగా ఒక్క ఫెయిల్యూర్ దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి తెరకెక్కించిన మరో సంక్రాంతి సినిమానే మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీలో హీరోయిన్‌గా లేడి సూపర్ స్టార్ నయనతార చేసిన విషయం తెలిసిందే.

దృశ్యం కథ చెప్పి

అయితే, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించేందుకు నయనతారను ఎలా ఒప్పించారో రీసెంట్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నయనతారకు దృశ్యం కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పడం ఆసక్తిగా మారింది.

"నయనతారను గారి సెలక్షన్ విషయంలో ఆమెతోనే చేద్దామా లేదా అల్టర్‌నేటివ్‌కి వెళ్దామా అంటే.. లేదు లేదు.. ఆల్టర్‌నేట్ వద్దు. నేను నయనతారను తెచ్చుకుంటా అని వెళ్లిపోయారంటా.. ఏంటా ధైర్యం మీకు" అని ఇంటర్వ్యూలో అనిల్‌ను జర్నలిస్ట్ అడిగారు.

3 పాత్రలు ఇంపార్టెంట్

"ఈ సినిమాలో మూడు పాత్రలు చాలా ఇంపార్టెంట్. చిరంజీవి గారు, జీవీఆర్ అనే పాత్ర సచిన్ ఖేడ్‌కర్, శశిరేఖ.. సచిన్ ఖేడ్‌కర్ కూతురు పాత్ర. కథ ఈ మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంటుంది. ఇంకో ఇంపార్టెంట్ రోల్ వెంకీ గారిది. అది ఎలాగు ఉంటది" అని అనిల్ రావిపూడి చెప్పారు.

"అంటే వెంకీ గారి రోల్‌ను ముందు అనుకోలేదట కదా. చివరిలో అనుకున్నారట" అని యాంకర్ అడిగారు. "లేదు కథ అనుకున్నప్పుడే ఉన్నారు. ఫస్ట్ నెరేషన్‌లోనే అయిపోయింది వెంకీ గారిది. అప్పుడే ఫిక్స్. నయనతార వీళ్లందరికంటే ముందే వెంకీ గారిది ఫిక్స్ అయిపోయింది" అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

"సో నయనతార గారిదే ఒక నెల ప్రాసెస్ జరిగింది. రెమ్యూనరేషన్‌లు అవి ఇవి డిస్కషన్స్ జరుగుతుంటే.. నేనే టచ్‌లోకి వెళ్లిపోయి ఫోన్ మాట్లాడా. ఒకరోజు ఆవిడ అనిల్ ఐ లైక్ యువర్ స్టోరీ మ్యాన్. టెల్, ఏం చేద్దామో చెప్పు అన్నారు" అని అనిల్ రావిపూడి వివరించారు.

నయనతారకు ఫోన్ చేయలేదు

"మేడమ్ మీరు చేస్తే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. చేయలేదనుకోండి.. దృశ్యం సినిమా ఒకసారి చూసి పడుకుంటా అన్నా. అదేంటీ అంది. దృశ్యంలో వెంకటేష్ గారు చెబుతారు కదా ఆరోజు మనం పూజకు వెళ్లలేదు అని.. సో అలా నేను ఆరోజు నయనతారకు ఫోన్ చేయలేదు, నేను తనతో మాట్లాడలేదు, అసలు నయనతారను నేనెప్పుడు మా సినిమా గురించి అడిగాను.. అలా మర్చిపోతానండి అంటే.. ఆ అమ్మాయి గట్టిగా నవ్వి డోంట్ వర్రీ నేను ఈ సినిమా చేస్తున్నాను అంది" అని అనిల్ రావిపూడి తెలిపారు.

దానికి యాంకర్ కూడా నవ్వారు. "మరి అల్టర్‌నేటివ్ చూసి పెట్టుకున్నారా" అని జర్నలిస్ట్ అడిగారు. "లేదు. గుడ్డి నమ్మకం (బ్లైండ్ బిలీఫ్) ఏంటంటే ఈ సినిమా అందరిని తెచ్చుకుంటుందని ఒక నమ్మకం ఉంది. సో అలాగే నయనతారని కథ తెచ్చుకుంది. శశిరేఖ పాత్రలో ఆమెను తప్పా ఇంకెవరిని నేను అస్సలు ఊహించుకోలేను" అని అనిల్ రావిపూడి హీరోయిన్ నయనతారను ఒప్పించిన విధానాన్ని వెల్లడించారు.