...
...
Next Story

అంకుల్స్ నా నడుము మీద చేయి వేశారు-అసభ్యకరమైన సైగలు-లో యాంగిల్ లో వీడియోలు-వాళ్ల కూతుర్లకు ఇలాగే చేస్తారా: నటి మౌనీ రాయ్

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం స్టేజీ పైకి వెళ్లిన ఆమె నడుముపై అంకుల్స్ చేయి వేశారని చెప్పింది. వాళ్ల కూతుర్లకు ఇలాగే చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించింది.

Published on: Jan 24, 2026, 18:31:28 IST
Advertisement

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ కు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ కోసం వెళ్లిన ఆమె వేధింపులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని శనివారం (జనవరి 24) ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లో వెల్లడించింది మౌనీ రాయ్. వాళ్ల కూతుళ్లకు, సిస్టర్స్ కు ఇలాగే జరిగితే ఊరుకుంటారా? అని ప్రశ్నించింది ఈ భామ.

మౌనీ రాయ్ బాధ

మౌనీ రాయ్
మౌనీ రాయ్

తాను ఇటీవల ప్రదర్శన ఇచ్చిన కార్యక్రమంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి నటి మౌనీ రాయ్ బహిరంగంగా వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొన్న, తాతయ్యలుగా పిలుచుకునే వయస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన కారణంగా తాను అవమానకరంగా, షాక్ కు గురయ్యానని మౌనీ తెలిపింది. వేధింపులకు గురయ్యాయని ఆమె ఆరోపించింది.

నడుముపై చేయి

‘‘నిన్న కర్నాల్‌లో ఒక కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న అతిథుల ప్రవర్తన, ముఖ్యంగా తాతయ్యలుగా పిలుచుకునే వయస్సులో ఉన్న ఇద్దరు అంకుల్స్ ప్రవర్తన నాకు అసహ్యం కలిగించింది. కార్యక్రమం ప్రారంభమై, నేను వేదికపైకి నడిచినప్పుడు అంకుల్స్, కుటుంబ సభ్యులు (అందరూ పురుషులే) ఫోటోలు తీయడానికి నా నడుముపై చేయి వేశారు’’ అని మౌనీ రాయ్ పేర్కొంది.

అసభ్యకరమైన సైగలు

‘‘నాకు అది నచ్చలేదు. వెంటనే నేను 'సార్, దయచేసి మీ చేయి తీయండి' అని చెప్పా. స్టేజీపై పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇద్దరు అంకుల్స్ సరిగ్గా నా ముందు నిలబడి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, అసభ్యకరమైన చేతి సైగలు చేస్తూ పేరు పెట్టి పిలిచారు. మొదట మర్యాదగా వారితో అలా చేయవద్దని సంజ్ఞ చేశా. దానికి వారు నాపై గులాబీ రేకులు విసరడం ప్రారంభించారు’’ అని మౌనీ తెలిపింది.

మౌనీ రాయ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్

కొత్త అమ్మాయిలు ఎలా?

‘‘మేము మా కళ ద్వారా నిజాయితీగా జీవనం సాగించడానికి ప్రయత్నిస్తున్న కళాకారులం. వారి కూతుర్లు, సిస్టర్స్ తో వాళ్ల పురుష స్నేహితులు ఇలాగే ప్రవర్తిస్తే వీళ్లు ఏం చేస్తారోనని ఆశ్చర్యపోతున్నాను. సిగ్గుపడండి! స్టేజీ కాస్త ఎత్తులో ఉంది. కింద నుంచి లో యాంగిల్స్ లో వీడియోలు తీశారు. వీడియోలు తీయొద్దంటే తిట్టారు’’ అని మౌనీ రాయ్ పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks