అప్పుడు బోర్డర్ మూవీ థియేటర్లలో చూడటానికి డబ్బుల్లేవు.. ఇప్పుడు సీక్వెల్‌లో ఓ హీరోగా.. నటుడి పోస్ట్ వైరల్

పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ ‘బోర్డర్ 2’ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. చిన్నప్పుడు డబ్బులు లేక ‘బోర్డర్’ సినిమాను థియేటర్‌లో చూడలేకపోయానని, టీవీలో చూశానని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇందులో భాగమయ్యానని ఎమోషనల్ అయ్యాడు.

Published on: Jan 28, 2026 2:32 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా.. అందులో నటించిన దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh) తన నటనకు గాను ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ.. మొదటి ‘బోర్డర్’ సినిమానాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. అప్పట్లో తన దగ్గర సినిమా చూసేందుకు డబ్బులు లేవని, ఇప్పుడు అదే సినిమా సీక్వెల్‌లో నటించడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నాడు.

అప్పుడు బోర్డర్ మూవీ థియేటర్లలో చూడటానికి డబ్బుల్లేవు.. ఇప్పుడు సీక్వెల్‌లో ఓ హీరోగా.. నటుడి పోస్ట్ వైరల్
అప్పుడు బోర్డర్ మూవీ థియేటర్లలో చూడటానికి డబ్బుల్లేవు.. ఇప్పుడు సీక్వెల్‌లో ఓ హీరోగా.. నటుడి పోస్ట్ వైరల్

టీవీలోనే చూశా..

బుధవారం (జనవరి 28) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో దిల్జీత్ దోసాంజ్ మాట్లాడుతూ.. "బోర్డర్ సినిమా వచ్చినప్పుడు దేశమంతా దాని గురించే మాట్లాడుకునేవారు. అప్పట్లో మా ఇంట్లో థియేటర్‌కు వెళ్లనిచ్చేవారు కాదు. పైగా మా దగ్గర థియేటర్‌లో సినిమా చూసేంత డబ్బులు కూడా లేవు. అందుకే ఆ సినిమా టీవీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి, టీవీలోనే చూశాను. అలా రెండు మూడు సార్లు చూసుంటాను" అని చెప్పాడు. తన ఏరియాలో ఒక వ్యక్తి థియేటర్‌లో సినిమా చూసి వచ్చి చెప్పిన విషయాలు విని చాలా ఎగ్జైట్ అయ్యానని గుర్తుచేసుకున్నాడు.

నేను అర్హుడిని కాదేమో..

ప్రస్తుతం తనకు దక్కుతున్న గౌరవం గురించి కూడా దిల్జీత్ మాట్లాడాడు. "ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే.. దేవుడు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను. ఈ సినిమాలో భాగం కావడానికి నన్ను నేను అర్హుడిగా భావించడం లేదు. కానీ దేవుడు నాకు ఏం ఇచ్చినా దానికి కృతజ్ఞుడిని" అని దిల్జీత్ వినమ్రంగా చెప్పాడు.

ఇందులో అతడు పరమ వీర చక్ర గ్రహీత, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ పాత్రను పోషించాడు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి కూడా ఈ చిత్రంలో నటించారు.

బోర్డర్ 2 బాక్సాఫీస్ ప్రభంజనం..

బోర్డర్ 2’ మూవీ విడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది. తొలి రోజు రూ.30 కోట్లతో ఈ మూవీ మొదలుపెట్టింది. ఇక రిపబ్లిక్ డే రోజు అంటే జనవరి 26న ఏకంగా రూ.59 కోట్లు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకుపైగా వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది.