...
...
Next Story

Border 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. 480 కోట్ల సినిమా.. 28 ఏళ్ల‌ తర్వాత సీక్వెల్‌.. ఇండో-పాక్ వార్

Border 2 OTT: ఓటీటీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. థియేటర్లో అదరగొట్టి, బాక్సాఫీస్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. 28 ఏళ్ల తర్వాత రిలీజైన ఈ సీక్వెల్ సూపర్ హిట్ గా నిలిచింది.

Published on: Mar 13, 2026 09:44 AM IST
Advertisement

ఇండియన్ సినీ హిస్టరీలో ‘బోర్డర్’ మూవీ ఓ ఐకానిక్ ఫిల్మ్. 1997లో రిలీజైన ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. దేశభక్తి సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. 28 ఏళ్ల తర్వాత ఈ మూవీ సీక్వెల్ గా ‘బోర్డర్ 2’ వచ్చింది. 2026లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

బోర్డర్ 2 ఓటీటీ

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ (x/TSeries)
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ (x/TSeries)

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బోర్డర్ 2 మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ దేశభక్తి సినిమా డిజిటల్ డెబ్యూ చేసేందుకు రెడీ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 20 నుంచి ఓటీటీ ఆడియన్స్ కు బోర్డర్ 2 మూవీ అందుబాటులోకి రానుంది.

బ్లాక్ బస్టర్

జనవరి 23, 2026న థియేటర్లలో రిలీజైన బోర్డర్ 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలో 1997లో బోర్డర్ మూవీ రిలీజైంది. 28 ఏళ్ల తర్వాత 2026లో వచ్చిన బోర్డర్ 2 కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ తదితరులు నటించాారు.

రూ.480 కోట్లు

బోర్డర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.480 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. సీక్వెల్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ బోర్డర్ 2 సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ ఉమ్మడిగా నిర్మించాయి. ఇందులో అహాన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా తదితరులు కూడా నటించారు.

బోర్డర్ 2 స్టోరీ

ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ ఫతేహ్ సింగ్ ఖేల్కర్ (సన్నీ డియోల్), లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్ (అహాన్ శెట్టి), మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్), ఎయిర్ ఫోర్స్ అఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ (దిల్జీత్ దోసాంజ్) ఎలాంటి పాత్ర పోషించారు? యుద్ధంలో ఎలా పోరాడారు? అనేది బోర్డర్ 2 మూవీలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe