...
...
Next Story

Brahmamudi March 21 Episode: రాజుకు గుర్తొచ్చిన గతం.. కలలో బస్సు పేలిపోవడం చూసి ఉలిక్కిపడి.. రేఖ కాళ్ల దగ్గర అపర్ణ

Brahmamudi March 21 Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 21 ఎపిసోడ్ లో రాజుకు బస్సు పేలిపోయే సీన్, అందులో తాను ఉన్నట్లు గుర్తుకు వచ్చేలా కల వస్తుంది. దీంతో ఉలిక్కి పడి లేస్తాడు. ఇటు రేఖ కాళ్ల దగ్గర అపర్ణ కూర్చొని క్షమాపణ చెబుతుంది.

Published on: Mar 21, 2026, 07:30:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సుభాష్ ను అడ్డం పెట్టుకొని రేఖ తన పంతం నెగ్గించుకుంటుంది. ఇక ఎప్పుడూ అపర్ణ తనకు ఎదురు చెప్పకుండా తాను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. మరోవైపు రాజు మెల్లగా తన వాళ్లకు దగ్గరయ్యేలా గతం గుర్తుకు రావడం మొదలైనట్లు చివర్లో వచ్చిన సీన్ చూస్తే అర్థమవుతోంది.

యాంటీ డోట్ ఇవ్వనంటూ రేఖ పంతం

Brahmamudi March 21 Episode: రాజుకు గుర్తొచ్చిన గతం.. కలలో బస్సు పేలిపోవడం చూసి ఉలిక్కిపడి.. రేఖ కాళ్ల దగ్గర అపర్ణ
Brahmamudi March 21 Episode: రాజుకు గుర్తొచ్చిన గతం.. కలలో బస్సు పేలిపోవడం చూసి ఉలిక్కిపడి.. రేఖ కాళ్ల దగ్గర అపర్ణ

బ్రహ్మముడి సీరియల్ శనివారం (మార్చి 21) ఎపిసోడ్ సుభాష్ కు యాంటీ డోట్ ఇవ్వాలని రేఖను ఇందు వేడుకునే సీన్ తో మొదలవుతుంది. డాక్టర్ ద్వారా ఏదో ఇంజెక్షన్ ఇప్పించి అతనికి ఊపిరి ఆడకుండా చేసిన రేఖ.. ఆ యాంటీ డోట్ తన దగ్గరే ఉందని, కానీ తాను ఇవ్వనని అంటుంది. దీంతో ఇందు ఆమెను ప్రాధేయపడుతుంది. దీంతో అది ఇంట్లోనే ఉందని చెబుతుంది.

ఇందుతో ఆడుకున్న రేఖ

మొదట తన గదిలో ఉంది వెళ్లి తెచ్చుకోమని ఇందుకి చెబుతుంది. ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడ చూసిన దొరకదు. మళ్లీ రేఖ దగ్గరకి వస్తుంది. ఈసారి భ్రమరాంబ గదికి పంపిస్తుంది. ఆ తర్వాత తన తాతయ్య గదికి వెళ్లమంటుంది. ఐశ్వర్య గదికీ పంపుతుంది. చివరికి స్వాతి గదిలో ఉందని అంటుంది. రేఖ ఆడుతున్న నాటకం అర్థమై ఇందును అడ్డుకుంటుంది అపర్ణ. అది రేఖ దగ్గరే ఉందని చెబుతుంది.

లాయర్‌ విషయం తెలుసుకున్న రేఖ.. అపర్ణ షాక్

ఈ విషయం బాగానే అర్థం చేసుకున్నావు.. మరి నా చేతిలో ఉన్న ఆస్తిని నీ మనవరాలి పేరిట రాసేందుకు లాయర్ ను కలిస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా అని అపర్ణను రేఖ నిలదీస్తుంది. దీంతో ఆమె షాక్ తింటుంది. నువ్వు నాకు తెలియకుండా బయటకు వెళ్తావు.. మీ నాన్నమ్మ లాయర్ ను కలుస్తుంది అని అనగానే ఇందు కూడా ఆశ్చర్యపోతుంది.

అలాంటి పనులు ఏమీ చేయమని, ఆ యాంటీ డోట్ ఇవ్వాలని ఇందు వేడుకుంటుంది. నువ్వు అంటున్నావు కానీ మీ నాన్నమ్మ చెప్పడం లేదు కదా అని రేఖ అంటుంది. దీంతో అపర్ణ కూడా కంటతడి పెడుతూ.. రేఖ కాళ్ల దగ్గర కూర్చొని తనను క్షమించమని అడుగుతుంది.

ఇంక ఎప్పుడూ నీమీద అరవను అని, ఇలాంటి పనులు చేయను అని అంటుంది. దీంతో రేఖ దిగి వస్తుంది. భూషణ్ దగ్గర ఉన్న యాంటీడోట్ ను ఇందుకి ఇస్తుంది. దీంతో అపర్ణ, ఇందు పరుగెత్తుకుంటూ వెళ్లి సుభాష్ కు యాంటీడోట్ ఇస్తారు. అది ఇవ్వగానే అతడు కాస్త కుదటపడతాడు.

ఎందుకిలా చేశావంటూ అపర్ణను నిలదీసిన ఇందు

ఆ తర్వాత ఎందుకిలా చేశావంటూ అపర్ణను ఇందు నిలదీస్తుంది. నీకోసమే చేశానని ఆమె అంటుంది. మీరు లేకుండా ఈ ఆస్తి అవసరం లేదు.. అయినా ఆ రేఖ ఈ ఆస్తి తన పేరిట వచ్చే వరకు మనల్ని ఏమీ చేయదు అని ఇందు చెబుతుంది. ఇక నుంచి నువ్వు రేఖకు ఎదురు తిరగొద్దు.. ఏం జరిగినా నేను చూసుకుంటానని అంటుంది. అపర్ణ సరే అంటుంది. ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం ఇందు ప్రయత్నాలు మొదలుపెడుతుంది.

రాజుకు గుర్తుకు వస్తున్న గతం

మరోవైపు రాజు నిద్రలో ఉండగా బస్సు పేలిపోయిన సీన్ గుర్తుకు వస్తుంది. దీంతో ఉలిక్కి పడి లేస్తాడు. అదే విషయం తల్లిదండ్రులకు చెబుతాడు. బస్సు మంటల్లో ఉందని, తాను అందులో నుంచి బయటపడినట్లుగా అనిపించిందని అంటాడు. కలే కదా అని తల్లి చెప్పినా రాజు బాధగా ఉంటాడు. ఇలా ఎందుకు జరిగింది.. రాజుకు అతని అయినవాళ్లు ఎవరైనా దగ్గరవుతున్నారా అని భర్తను ఆమె అడుగుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe