రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్ ద రివెంజ్' సినిమా ఏకంగా నాలుగు గంటల రన్టైమ్ తో థియేటర్లలోకి వచ్చింది. మన ఇండియాలో సినిమా సగానికి రాగానే ఇంటర్వెల్ ఇవ్వడం అనేది చాలా మామూలు విషయం. కానీ కెనడా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఈ అలవాటు అస్సలు ఉండదు. సినిమా మొదలైతే పూర్తయ్యే దాకా మధ్యలో ఎలాంటి బ్రేక్ ఇవ్వరు. మరి అలాంటి చోట ఈ సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని కెనడాలోని ఒక థియేటర్ యాజమాన్యం మొదటిసారి ఇంటర్వెల్ ఇస్తే.. అక్కడి ప్రేక్షకులు ఎలా ఫీల్ అయ్యారో తెలుసా? వాళ్ళ రియాక్షన్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
కెనడా ప్రేక్షకులకు ఇంటర్వెల్ కొత్త అనుభవం..

'జర్నీ విత్ షెఫాలీ' అనే ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ దీనికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ధురంధర్ 2 సినిమా మధ్యలో 15 నిమిషాల పాటు బ్రేక్ ఇవ్వడం చూసి జనాలు ఎంతో ఆశ్చర్యంగా, సంతోషంగా నవ్వుకుంటూ తమ సీట్లలో నుంచి బయటకు వెళ్ళడం మనం చూడొచ్చు. చాలా మంది సీట్లలోనే కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఆ గ్యాప్ను భలే ఎంజాయ్ చేశారు.
ఆ వీడియో కింద ఏమని రాసుందంటే..
"ఇది ధురంధర్ 2 ఎఫెక్ట్. సినిమా నాలుగు గంటలు ఉండటంతో సినీప్లెక్స్ (Cineplex) థియేటర్ వాళ్ళు బహుశా వాళ్ల చరిత్రలో మొదటిసారిగా ఇలా ఇంటర్వెల్ ఇచ్చారు. నేను కెనడాలో ఉంటున్న ఈ 20 ఏళ్లలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. థియేటర్లో ఉన్నవాళ్లంతా చాలా సంతోషపడ్డారు" అని ఆ వీడియోపై రాసి ఉంది.
మన దగ్గరలాగా అక్కడ సినిమాలకు మధ్యలో బ్రేక్ ఉండదు. కానీ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు బాత్రూమ్ వెళ్ళడానికి, స్నాక్స్ కోసం జనాలు ఇంటర్వెల్ అడగటంతో, ఈసారి సినీప్లెక్స్ వాళ్ళు ఆ కోరిక తీర్చారని ఆవిడ చెప్పుకొచ్చింది.
నెటిజన్ల కామెంట్స్ ఎలా ఉన్నాయంటే..
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. "చిన్న విషయమే కావచ్చు కానీ మా కళ్ళను మేమే నమ్మలేకపోయాం, మేమంతా థియేటర్లో గోల చేసి అరిచాం" అని ఒకరు రాశారు.
{{/usCountry}}ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. "చిన్న విషయమే కావచ్చు కానీ మా కళ్ళను మేమే నమ్మలేకపోయాం, మేమంతా థియేటర్లో గోల చేసి అరిచాం" అని ఒకరు రాశారు.
{{/usCountry}}ఇంకొకరు స్పందిస్తూ, "ఇంటర్వెల్ అనేది మన ఇండియన్ సినిమాలకే సొంతం.. డైరెక్టర్ తన తెలివితేటలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం" అని రాశాడు.
"90లు, 2000ల మొదట్లో కెనడాలో ప్రతి బాలీవుడ్ సినిమాకు ఇలా బ్రేక్ ఇచ్చేవాళ్ళు, దాన్ని నేను బాగా మిస్ అవుతున్నాను" అని ఒకరు గుర్తుచేసుకోగా.. "ప్రతి థియేటర్లో ఒక టైమర్ పెట్టి మరీ ఈ ఇంటర్వెల్ విధానాన్ని తీసుకువస్తే బాగుంటుంది" అని మరో అభిమాని తన అభిప్రాయం పంచుకున్నాడు.
ధురంధర్ 2 సినిమా గురించి..
డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన ఈ సినిమా బుధవారం (మార్చి 18) వేసిన పెయిడ్ ప్రీమియర్స్ తర్వాత, మార్చి 19న గ్రాండ్గా థియేటర్లలోకి వచ్చింది. 2025లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'దురంధర్'కు ఇది సీక్వెల్. ఇందులో రణ్వీర్ సింగ్తో పాటు మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ లాంటి స్టార్లు ముఖ్య పాత్రలు పోషించారు. తొలి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.