పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో

రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన నీలకంఠ సినిమాలో నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్గా చేశారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం (డిసెంబర్ 30) సాయంత్రం నీలకంఠ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. యంగ్ హీరోలు ఆది సాయి కుమార్, ఆకాష్ జగన్నాథ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో హీరో మహేంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
గర్వపడే హిట్
హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. "తెలుగు ఆడియెన్స్ నాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. ఆది నాకు మంచి ఫ్రెండ్. శంబాల హిట్తో సాయి కుమార్ గారు గర్వపడేలా విజయాన్ని అందుకున్నారు. ఆకాష్ ఈ ఈవెంట్కు రావడం హ్యాపీగా ఉంది" అని అన్నాడు.
"నాకు సినిమానే ప్రపంచం. చాలా పోటీ ఉంది, కొత్త హీరోలు వస్తున్నారు అని నాతో సన్నిహితులు చెబుతుంటారు. కానీ, నేను నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అనేది ఒక్కటే నాకు తెలిసింది" అని చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ తెలిపాడు.
షూటింగ్ జరగలేదు
"నీలకంఠ సినిమాకు మా టీమ్ అంతా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్స్ ఇద్దరు ప్యాషనేట్. వాళ్లు సెట్లో లేకుండా ఒక్క రోజు కూడా షూటింగ్ జరగలేదు. డైరెక్టర్ కొత్త అయినా టాలెంటెడ్. అతను ఇచ్చిన నెరేషన్తోనే ఎంత టాలెంటెడ్ అనేది తెలిసింది. యష్న సీతగా ఆకట్టుకుంటుంది. జనవరి 2న థియేటర్స్లోకి వస్తున్న మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా" అని కోరాడు హీరో మహేంద్రన్.
{{/usCountry}}"నీలకంఠ సినిమాకు మా టీమ్ అంతా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్స్ ఇద్దరు ప్యాషనేట్. వాళ్లు సెట్లో లేకుండా ఒక్క రోజు కూడా షూటింగ్ జరగలేదు. డైరెక్టర్ కొత్త అయినా టాలెంటెడ్. అతను ఇచ్చిన నెరేషన్తోనే ఎంత టాలెంటెడ్ అనేది తెలిసింది. యష్న సీతగా ఆకట్టుకుంటుంది. జనవరి 2న థియేటర్స్లోకి వస్తున్న మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా" అని కోరాడు హీరో మహేంద్రన్.
{{/usCountry}}డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ.. "కొత్త దర్శకుడిని అయినా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు, వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. వాళ్లు నాతో సినిమా చేస్తానని చెప్పిన ఒక్క మాటను నిలబెట్టుకుంటూ భారీ బడ్డెట్తో సినిమా చేశారు" అని అన్నారు.
క్యారెక్టర్స్లో నటించారు
"మాస్టర్ మహేంద్రన్ ఒక బ్రదర్లా సపోర్ట్ చేశాడు. నేను ఇమాజిన్ చేసుకున్న సీత క్యారెక్టర్కు యష్న పర్పెక్ట్గా కుదిరింది. యాటసిరి, కోట, నాయుడుపేట అనే మూడు ఊర్లలో ఈ సినిమా షూటింగ్ చేశాం. అక్కడి స్థానిక ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్లో నటించారు" అని డైరెక్టర్ రాకేష్ మాధవన్ తెలిపారు.
"ఇదొక గెలిచిన వ్యక్తి కథ. సినిమా చూస్తున్నప్పుడు ఆ గెలుపు మీది అనుకుంటారు. మా మూవీలో యాక్షన్, లవ్, ఎమోషన్ వంటి ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. కమర్షియల్గా ఉంటూనే విద్య ఎంత ముఖ్యం అనే మంచి విషయాన్ని చెప్పాం. ఈ సినిమా మా అందరికీ పేరు తీసుకొస్తుంది" అని నీలకంఠ దర్శకుడు రాకేష్ మాధవన్ పేర్కొన్నారు.