తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్గా పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శ్రీమతి, వీవీ సుమలత దేవి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సుమలత దేవి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇవాళ (డిసెంబర్ 18) హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా

ఈ కార్యక్రమానికి శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వీవీ సుమలత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మొట్ట మొదటిసారిగా మహిళ అధ్యక్షురాలు
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. "ఈ యూనియన్కు మొట్ట మొదటిసారిగా మహిళ అధ్యక్షురాలు ఎన్నికవ్వడం ఆనందంగా ఉంది. సుమలత గారి విజయం యూనియన్కు కొత్త రూపుని తీసుకు వస్తుందని నమ్ముతున్నాను" అని అన్నారు.
యూనియన్కు అండగా ఉంటాను
"జానీ మాస్టర్ గారు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన జానీ మాస్టర్ గారు, ఆయన సతీమణి సుమలత గారి మీద నమ్మకంతో వారిని ఎన్నుకున్నారు. మా ఫ్యామిలీని తమ ఫ్యామిలీగా చూసుకునే సినీ కార్మికులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఈ యూనియన్కు ఎప్పుడూ అండగా ఉంటాను" అని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు.
ప్రతీ ఒక్క సమస్యను పరిష్కరిస్తాను
వీవీ సుమలతా దేవి మాట్లాడుతూ .. "నా ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ, ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. యూనియన్లో ఉన్న ప్రతీ ఒక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా” అని తెలిపారు.
కేసులు పెట్టుకుంటే చులకన
శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ .. "ఎన్నికల్లో గెలిచిన సుమలత దేవి గారికి కంగ్రాట్స్. యూనియన్లో చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని మనలో మనమే పరిష్కరించుకుందాం. బయటకు వెళ్లి కేసులు పెట్టుకోవడం వల్ల మనమే చులకన అవుతాం. మనమంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతీ ఒక్కరికీ నా శుభాకాంక్షలు" అని అన్నారు.
యూనియన్ కార్యవర్గం
{{/usCountry}}శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ .. "ఎన్నికల్లో గెలిచిన సుమలత దేవి గారికి కంగ్రాట్స్. యూనియన్లో చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని మనలో మనమే పరిష్కరించుకుందాం. బయటకు వెళ్లి కేసులు పెట్టుకోవడం వల్ల మనమే చులకన అవుతాం. మనమంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతీ ఒక్కరికీ నా శుభాకాంక్షలు" అని అన్నారు.
యూనియన్ కార్యవర్గం
{{/usCountry}}ఇదిలా ఉంటే ఈ యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి. చిరంజీవి కుమార్, ఉపాధ్యక్షులుగా కె. సురేష్, యమ్. రాజు, సహ కార్యదర్శులుగా కే. కిరణ్ కుమార్, ఏ. రాము, కార్య నిర్వహక కార్యదర్శిగా యు. శివ కృష్ణ నియామకమయ్యారు.
కమిటీ సభ్యులు
అలాగే, కమిటీ సభ్యులుగా కె. సతీష్ గౌడ్, కె. శ్రీదేవి, పి. సురేష్, ఎస్. వేదాంత, మనోహర్, ఎల్. కృష్ణ, బి. సుమన్, ఆర్. బోస్, ఎస్. శృతి ప్రమాణ స్వీకారం చేశారు.