బాలీవుడ్ అగ్ర కమెడియన్ రాజ్పాల్ యాదవ్ అనేక సినిమాల్లో తన నటనతో నవ్వించారు. ఇటీవల కోర్టు కేసు నుంచి బయటకు వచ్చిన రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం హారర్ కామెడీగా తెరకెక్కిన 'భూత్ బంగ్లా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రత్యేకంగా ఒక పాత్రను

భూత్ బంగ్లా సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు రాజ్పాల్ యాదవ్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నిర్మించిన 'ఓం శాంతి ఓం' సినిమాలో రాజ్పాల్ కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను రాయించారట. కానీ, ఆ పాత్రను రాజ్పాల్ యాదవ్ తిరస్కరించినట్లు షారుఖ్ దగ్గర ఎవరో తప్పుడు సమాచారం చేరవేశారని ఆయన తెలిపారు.
"నీకోసం ఒక మంచి లెంత్ ఉన్న రోల్ రాశాము. కానీ, నీకు టైమ్ లేదని రిజెక్ట్ చేశావంట కదా?" అని స్వయంగా షారుఖ్ ఖాన్ అడిగే వరకు రాజ్ పాల్కు ఈ విషయం తెలియలేదని రాజ్పాల్ యాదవ్ చెప్పుకొచ్చారు.
వెన్నుపోటు పొడిచింది ఎవరు?
సినిమా రంగంలో తెర వెనుక రాజకీయాలు ఎలా ఉంటాయో రాజ్పాల్ మాటల్లో స్పష్టమైంది. ఈ అపార్థం గురించి రాజ్పాల్ యాదవ్ మాట్లాడుతూ.. "బిల్లు బార్బర్ షూటింగ్ సమయంలో ఈ విషయం నాకు తెలిసింది. నా మేనేజర్ను అడిగితే అతడికి కూడా ఏమీ తెలియదు. ఎవరో మధ్యలో కావాలనే నా గురించి షారుక్ భాయ్కి తప్పుగా చెప్పారు. నా ఫోటోను కూడా నెగెటివ్గా ప్రెజెంట్ చేశారని తెలిసింది. బాలీవుడ్లో ఇలాంటివి సర్వసాధారణం" అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం ఒక మధ్యవర్తి చేసిన పని వల్ల ఒక భారీ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ ఆయనకు చేజారిపోయింది. తెలుగు సినిమాల్లో కూడా గతంలో ఇలాంటి సందర్భాలు మనం చూశాం. ఒక హీరోకి అనుకున్న కథ, మరొక హీరో దగ్గరికి వెళ్లడం వెనుక ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎంతో ప్రభావం చూపుతుంటాయి.
అపార్థాలు తొలగిపోయాయి
{{/usCountry}}కేవలం ఒక మధ్యవర్తి చేసిన పని వల్ల ఒక భారీ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ ఆయనకు చేజారిపోయింది. తెలుగు సినిమాల్లో కూడా గతంలో ఇలాంటి సందర్భాలు మనం చూశాం. ఒక హీరోకి అనుకున్న కథ, మరొక హీరో దగ్గరికి వెళ్లడం వెనుక ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎంతో ప్రభావం చూపుతుంటాయి.
అపార్థాలు తొలగిపోయాయి
{{/usCountry}}ఈ విషయం తెలిసిన వెంటనే రాజ్పాల్ యాదవ్, షారుక్ ఖాన్ను కలిసి అసలు నిజం వివరించారు. 'కల్ హో నా హో' సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్లు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. ఆ చనువుతోనే ఇద్దరూ మాట్లాడుకుని అపార్థాలను తొలగించుకున్నారట. "మేము ఇద్దరం కౌగిలించుకున్నాం, అప్పటితో ఆ ఇష్యూ క్లియర్ అయిపోయింది" అని రాజ్పాల్ యాదవ్ చెప్పుకొచ్చారు.
త్వరలో 'భూత్ బంగ్లా' హంగామా
రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో 'భూత్ బంగ్లా' అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా, వామీకా గబ్బి, టబు, పరేశ్ రావెల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
దాదాపు పుష్కర కాలం తర్వాత ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 17న ఈ హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.