OTT Operation Sindoor: డిస్కవరీ ఛానెల్, డిస్కవరీ ప్లస్ ఓటీటీలో గ్రాండ్గా రిలీజ్ అయిన ‘డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్’ (Declassified: Operation Sindoor) డాక్యుమెంటరీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. ఈ షోలో ప్రసారమైన ఇంటెన్స్ మిలిటరీ సీన్స్, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ ప్లానింగ్ చూసి పాకిస్థాన్ మిలిటరీ తీవ్ర భయాందోళనకు గురైంది. అర్ధరాత్రి వేళ పాక్ ఆర్మీ జనరల్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా పెద్ద దుమారం రేపుతున్నాయి.
అర్ధరాత్రి 2 గంటలకు పాక్ జనరల్ ఆక్రోశం

పాకిస్థాన్ మిలిటరీ అధికార ప్రతినిధి (DG ISPR) లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఈ ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీ ప్రసారమైన కొద్ది రోజులకే ఎక్స్ వేదికగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు ఆయన సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ.. ఈ షోను ఒక 'కామెడీ అండ్ ట్రాజెడీ' అని అభివర్ణించారు.
భారత కంటెంట్ క్రియేటర్లు బాలీవుడ్ తరహా డ్రామా క్రియేట్ చేసి యథార్థాలను మార్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే పాక్ సైన్యం ఎంత చెప్పినా, భారత ఆర్మీ గతంలోనే విడుదల చేసిన శాటిలైట్ ఆధారాల ముందు వారి ఆరోపణలు నిలబడలేకపోతున్నాయి.
88 గంటల ఆపరేషన్.. అజిత్ దోవల్ క్రేజీ ప్లాన్
ఈ డాక్యుమెంటరీ సిరీస్ మే 2025లో భారత సాయుధ దళాలు నిర్వహించిన అత్యంత రహస్య ‘ఆపరేషన్ సిందూర్’ ఆధారంగా తెరకెక్కింది. ఏప్రిల్ 2025లో పహల్గామ్లో జరిగిన దారుణ తీవ్రవాద దాడికి ప్రతికారంగా భారత సైన్యం ఈ 88 గంటల భారీ ఆపరేషన్ చేపట్టింది. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) అజిత్ దోవల్, ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది లాంటి అగ్రశ్రేణి సైనిక అధికారులు స్వయంగా ఈ సిరీస్లో మాట్లాడారు. ఇండియా వార్ రూమ్లో ఏం జరిగింది, పాక్ భూభాగంలోని టెర్రరిస్ట్ క్యాంపులను క్షిపణులతో ఎలా ధ్వంసం చేశారనేది రెండు ఎపిసోడ్లలో మైండ్ బ్లాకింగ్ విజువల్స్తో చూపించారు.
'ది గ్రీన్ లైట్' అండ్ 'అటాక్ అండ్ కౌంటర్ స్ట్రైక్'
ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సిరీస్లో మొత్తం రెండు పార్ట్లు ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ 'ది గ్రీన్ లైట్' కాగా, రెండో ఎపిసోడ్ 'అటాక్ అండ్ కౌంటర్ స్ట్రైక్'. ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాల వ్యవధితో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.
{{/usCountry}}ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సిరీస్లో మొత్తం రెండు పార్ట్లు ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ 'ది గ్రీన్ లైట్' కాగా, రెండో ఎపిసోడ్ 'అటాక్ అండ్ కౌంటర్ స్ట్రైక్'. ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాల వ్యవధితో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.
{{/usCountry}}న్యూక్లియర్ పవర్ ఉన్న రెండు పొరుగు దేశాల మధ్య జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరాటంలో ఇండియా సాధించిన 100 శాతం సక్సెస్ను స్పష్టమైన ఆధారాలతో చూపించడం పాక్ ఆర్మీకి మింగుడుపడటం లేదు. దీంతో ఇది తమ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రాపగండా వీడియో అని పాక్ ప్రచారం చేస్తోంది.
ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?
ప్రస్తుతం ఈ సంచలనం సృష్టించిన డాక్యుమెంటరీ డిస్కవరీ ఛానెల్లో ప్రసారమవుతోంది. ఓటీటీ ప్రియులు దీన్ని డిస్కవరీ ప్లస్ (Discovery+) యాప్లో నేరుగా చూడవచ్చు.
అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో లభించే డిస్కవరీ బండిల్ సబ్స్క్రిప్షన్ ద్వారా కూడా ఈ క్రేజీ మిలిటరీ సిరీస్ను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. పక్కా రియలిస్టిక్ వార్ రూమ్ డ్రామా చూడాలనుకునే వారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్.