నెట్ఫ్లిక్స్ లో విమర్శకుల ప్రశంసలు పొందిన క్రైమ్ డ్రామా 'ఢిల్లీ క్రైమ్' అభిమానుల నిరీక్షణకు తెరపడింది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న ఈ సిరీస్ నుంచి మరో కొత్త సీజన్ వచ్చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్, అవినీతి, నైతిక సంఘర్షణల చీకటి కోణాలను మరింత లోతుగా అన్వేషించే ఒక ఉత్కంఠభరితమైన మూడవ సీజన్తో తిరిగి వచ్చింది. ఈ కథాంశం భయంకరంగాను, హృదయ విదారకంగాను ఉంటుందని హామీ ఇస్తోంది.
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 ఓటీటీ

ఓటీటీలోకి పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో మోస్ట్ ఫేమస్ సిరీస్ ల్లో ఇది ఒకటి. ఇది గురువారం (నవంబర్ 13) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో డీసీపీ వర్తికా చతుర్వేది ప్రయాణంలోని పాత భాగాలను మళ్లీ చూడాలనుకునే వారి కోసం గత రెండు సీజన్లు కూడా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి.
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 కథ ఏంటి?
నెట్ఫ్లిక్స్ ఈ సీజన్ విడుదల గురించి మొదట ఒక భయంకరమైన లైన్తో టీజ్ చేసింది. ఈ కొత్త సీజన్లో డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ షా), ఆమె బృందం ఢిల్లీ సరిహద్దులు దాటి విస్తరించిన ఒక క్రిమినల్ నెట్వర్క్ను ఎదుర్కొంటుంది. యువతులను దోపిడీ చేసి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న బడీ దీదీ (హుమా ఖురేషి) ఈ నెట్వర్క్కు నాయకత్వం వహిస్తుంది. ఒక శిశువు ఆచూకీ దేశవ్యాప్తంగా సాగే ఒక నిర్విరామ వేటకు దారితీస్తుంది.
అదిరే రెస్పాన్స్
ఓటీటీలోకి రిలీజైన ఢిల్లీ క్రైమ్ సీజన్ 3కి అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ ఈ సిరీస్ చూడటం కోసం ఇన్ని రోజులూ వెయిట్ చేశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు తనుజ్ చోప్రా మరోసారి ఈ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. రసికా దుగల్ (నీతి సింగ్), రాజేష్ తైలాంగ్ (భూపేంద్ర సింగ్), జయ భట్టాచార్య (విమలా భరద్వాజ్), అనురాగ్ అరోరా (జైరాజ్ సింగ్) తమ పాత్రలను తిరిగి పోషిస్తున్నారు. ఈ తారాగణంలో హుమా ఖురేషి, సయానీ గుప్తా, మితా వశిష్ఠ్, కెల్లీ దోర్జీ, అన్షుమాన్ పుష్కర్ వంటి వారు చేరారు.
{{/usCountry}}ఓటీటీలోకి రిలీజైన ఢిల్లీ క్రైమ్ సీజన్ 3కి అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ ఈ సిరీస్ చూడటం కోసం ఇన్ని రోజులూ వెయిట్ చేశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు తనుజ్ చోప్రా మరోసారి ఈ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. రసికా దుగల్ (నీతి సింగ్), రాజేష్ తైలాంగ్ (భూపేంద్ర సింగ్), జయ భట్టాచార్య (విమలా భరద్వాజ్), అనురాగ్ అరోరా (జైరాజ్ సింగ్) తమ పాత్రలను తిరిగి పోషిస్తున్నారు. ఈ తారాగణంలో హుమా ఖురేషి, సయానీ గుప్తా, మితా వశిష్ఠ్, కెల్లీ దోర్జీ, అన్షుమాన్ పుష్కర్ వంటి వారు చేరారు.
{{/usCountry}}గోల్డెన్ కారవాన్, ఎస్కే గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సిరీస్కు తనుజ్ చోప్రా, అను సింగ్ చౌదరి, అపూర్వ బక్షి, మైఖేల్ హోగన్, మయాంక్ తివారీ, శుభ్రా స్వరూప్ రచన చేశారు.