రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2: ది రివెంజ్ థియేటర్లలోకి రాకముందే చరిత్ర సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ భారీ సీక్వెల్ మార్చి 19, 2026న విడుదల కానుంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లోనూ ధురంధర్ 2 రికార్డులు తిరగరాస్తోంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసే దిశగా ధురంధర్ 2 దూసుకెళ్తోంది.
104 రోజులకే

ధురంధర్ 2 బాలీవుడ్ చరిత్రలో అత్యంత వేగంగా విడుదలైన సీక్వెల్ గా నిలవనుంది, మొదటి చిత్రం విడుదలైన 104 రోజులకే ధురంధర్ 2 థియేటర్లకు వస్తోంది. ధురంధర్ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ధురంధర్ 2 ఏమో రేపు (మార్చి 19)న థియేటర్లకు రాబోతోంది.
బాహుబలి 2 రికార్డుకు ఎసరు!
సక్నిల్క్ నివేదికల ప్రకారం ధురంధర్ 2 తన ఫస్ట్ డే, ప్రీవ్యూ షోల కోసం జాతీయ మల్టీప్లెక్స్ చైన్లలో ఏకంగా 6 లక్షల టిక్కెట్లను విక్రయించింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి 2 (హిందీ) రికార్డుకు అతి సమీపంలో ఉంది. బాహుబలి 2 ఏమో 6.50 లక్షల టికెట్లు సేల్ చేసింది.
టాప్ అడ్వాన్స్ బుకింగ్స్ (హిందీ)
బాహుబలి 2: 6.50 లక్షలు
ధురంధర్ 2: 6.00 లక్షలు (ఇంకా ఒక రోజు మిగిలి ఉంది!)
జవాన్: 5.57 లక్షలు
పఠాన్: 5.56 లక్షలు
నైట్ షోల హవా!
ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు హైదరాబాద్లో కూడా ధురంధర్ 2 సినిమా డిమాండ్ మామూలుగా లేదు. అర్ధరాత్రి షోల అడ్వాన్స్ బుకింగ్స్ సైతం నిమిషాల్లో ఫుల్ అయిపోతున్నాయి. PVR INOX లోనే 1.5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటే రణ్వీర్ సింగ్ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే బాహుబలి 2 ఈ రికార్డును కేవలం డే-1 బుకింగ్స్ తో సాధిస్తే, ధురంధర్ 2 ప్రీమియర్ షోల సాయంతో ఈ ఘనత సాధిస్తోంది. ఏది ఏమైనా, రేపటికల్లా బాహుబలి 2 రికార్డు కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది!
ధురంధర్ గురించి
{{/usCountry}}అయితే బాహుబలి 2 ఈ రికార్డును కేవలం డే-1 బుకింగ్స్ తో సాధిస్తే, ధురంధర్ 2 ప్రీమియర్ షోల సాయంతో ఈ ఘనత సాధిస్తోంది. ఏది ఏమైనా, రేపటికల్లా బాహుబలి 2 రికార్డు కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది!
ధురంధర్ గురించి
{{/usCountry}}ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ మూవీ డిసెంబర్ 5, 2025న రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ధురంధర్ 2 రాబోతుంది. ఇందులో సారా అర్జున్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తదితరులు నటించారు.