డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైనప్పటి నుండి ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా తాజాగా రూ.1200 కోట్ల క్లబ్లోనూ చేరింది. ఈ చిత్రంతోనే రణ్ వీర్ సింగ్కు జోడీగా బాలీవుడ్ అరంగేట్రం చేసింది హీరోయిన్ సారా అర్జున్.
సారా అర్జున్ పోస్ట్

ధురంధర్ సినిమా విజయంపై సారా అర్జున్ హృదయపూర్వక సందేశం వైరల్ గా మారింది. ప్రేక్షకులు చూపిన అపారమైన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సారా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
‘‘నా బలమైన 'ధురంధర్లు' – ప్రేక్షకులు. చాలా కాలంగా సుదీర్ఘ కథనాల (లాంగ్ రన్ టైమ్ మూవీస్)పై ప్రేక్షకులు సహనం చూపడం లేదని, చూసే స్థాయి తగ్గిపోయిందని, ఈ సినిమాలకు ఇక చోటు లేదని ఒక అభిప్రాయం ఉంది. కానీ మీరు దానికి విరుద్ధంగా నిరూపించారు. ప్రేక్షకుల నిజమైన బలాన్ని, వారు నిజంగా నమ్మేదాన్ని సమర్థించడానికి ఏకమైనప్పుడు ఏమి జరుగుతుందో మీరు అందరికీ గుర్తు చేశారు’’ అని సారా అర్జున్ రాసుకొచ్చారు.
మీ వల్లే ఇదంతా
‘‘ధురంధర్ ప్రయాణం మీ వల్లే ఇలా సాధ్యమైంది. మీరు చూపిన ప్రతి ప్రేమ, మీరు వచ్చిన ప్రతి క్షణం ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లింది. నేను మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కళాకారులుగా, దర్శకులుగా మేము ప్రక్రియలోని ప్రతి భాగాన్ని నియంత్రించగలము, కానీ ప్రేక్షకులపై మాకు కంట్రోల్ ఉండదు. ఆ కనెక్షన్ జరిగినప్పుడు, అది ప్రపంచంలోనే అత్యంత సంతృప్తికరమైన అనుభూతులలో ఒకటి’’ అని సారా అర్జున్ తెలిపారు.
ఆ క్రెడిట్ నాది కాదు
{{/usCountry}}‘‘ధురంధర్ ప్రయాణం మీ వల్లే ఇలా సాధ్యమైంది. మీరు చూపిన ప్రతి ప్రేమ, మీరు వచ్చిన ప్రతి క్షణం ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లింది. నేను మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కళాకారులుగా, దర్శకులుగా మేము ప్రక్రియలోని ప్రతి భాగాన్ని నియంత్రించగలము, కానీ ప్రేక్షకులపై మాకు కంట్రోల్ ఉండదు. ఆ కనెక్షన్ జరిగినప్పుడు, అది ప్రపంచంలోనే అత్యంత సంతృప్తికరమైన అనుభూతులలో ఒకటి’’ అని సారా అర్జున్ తెలిపారు.
ఆ క్రెడిట్ నాది కాదు
{{/usCountry}}‘‘నేను ఇప్పుడే ప్రారంభించా. నేను భాగమైన చిత్రానికి, నేను చేయటానికి ప్రయత్నిస్తున్న పనికి ఇంత త్వరగా ఈ విధమైన ప్రోత్సాహాన్ని పొందడం నాకు మాటలకు అందనిది. ఇది నన్ను బలపరుస్తుంది. మీరు నిజంగా అనుభూతి చెందారని, కథ మీకు చేరిందని చూడటం, నేను క్రెడిట్ తీసుకోని విజయం. ఆ క్రెడిట్ దర్శకులదే. దానిలో భాగం కావడం పట్ల నేను కృతజ్ఞురాలిని’’ అని సారా అర్జున్ ముగించింది.
ధురంధర్ లో కరాచీలోని లియారీలో ఉన్న ఉగ్రవాద నెట్వర్క్లలోకి చొరబడిన భారతీయ గూఢచారిగా రణ్ వీర్ సింగ్ నటించాడు. ఇందులో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రెండవ భాగం మార్చి 2026లో థియేటర్లలో విడుదల కానుంది.