సికందర్ను దాటేసిన దురంధర్-సల్మాన్ మూవీ రికార్డు బ్రేక్ చేసిన రణ్వీర్ సింగ్-మండే టెస్ట్ పాస్-4 రోజులు కలెక్షన్
రణ్వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ దురంధర్ సోమవారం కూడా టిక్కెట్ కౌంటర్ వద్ద అద్భుతంగా దూసుకుపోయింది. మండే టెస్ట్ పాస్ అయింది ఈ సినిమా. సల్మాన్ ఖాన్ సికందర్ కలెక్షన్లను దాటేసింది.
దురందర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 4వ రోజు: దురంధర్ మూవీ టిక్కెట్ కౌంటర్ వద్ద తన వేగాన్ని కొనసాగిస్తోంది. ఇప్పట్లో అది తగ్గే సంకేతాలు ఏవీ కనిపించడం లేదు. మండే టెస్ట్ కూడా ఈ మూవీ పాసైంది. ఆదిత్య ధార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ దురంధర్ తన తొలి వీకెండ్ లో ఇండియాలో రూ.103 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇప్పుడు వీక్ డేస్ లోనూ అదరగొడుతోంది.

దురంధర్ కలెక్షన్లు
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్. నోటి మాటల ద్వారా గణనీయమైన ఊపు తెచ్చుకుని అద్భుత ప్రదర్శన చేస్తోంది ఈ సినిమా. ఇప్పుడు తన తొలి వారం రోజున ఈ చిత్రం ముఖ్యమైన సోమవారం టెస్ట్ను విజయవంతంగా దాటినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో కలిపి ఇండియాలో రూ.123.91 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.
సోమవారం ఇలా
సోమవారం (డిసెంబర్ 8) ఈ చిత్రం థియేటర్లలో తన తొలి వారం రోజును ఎదుర్కొంది. ఇప్పటివరకు వచ్చిన ఆక్యుపెన్సీ గణాంకాలు ప్రేక్షకులు ఈ చిత్రంలో బలమైన ఆసక్తిని కలిగి ఉన్నారని సూచిస్తున్నాయి. ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం దురంధర్ సోమవారం ఉదయం షోలకు 13% ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షోలకు 26% పైగా, సాయంత్రం 37.71% ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
ఈ గణాంకాలు దురంధర్ శుక్రవారం నంబర్లతో పోల్చదగినవి. ఇది తన ఊపును కొనసాగిస్తున్నట్లు సూచిస్తుంది. ట్రేడ్ ట్రాకర్ ప్రకారం దురంధర్ సోమవారం ఇండియాలో రూ.20.91 కోట్లు నెట్ వసూలు చేసిందని అంచనా.
సికందర్ ను దాటి
దురంధర్ సినిమా బలమైన ఓపెనింగ్ ను సాధించింది. తదుపరి రెండు రోజుల్లో 14%, 34% పెరుగుదలతో తన ప్రదర్శనను మరింత మెరుగుపరిచింది. మండే కలెక్షన్లతో సికందర్ జీవితకాల కలెక్షన్ను అధిగమించింది దురంధర్. సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ ఇండియాలో రూ.109.83 కోట్లు నెట్ వసూలు చేసింది. దురంధర్ నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.123.91 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్లు దాటి దూసుకెళ్తోంది.
దురంధర్ గురించి..
ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్ లో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఇది ఒక స్పై థ్రిల్లర్. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలు పొందింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జనవరి 30న రిలీజ్ అయ్యే అవకాశముంది.














