బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ర‌ణ్‌వీర్ సింగ్ స్పై థ్రిల్ల‌ర్‌-మూడు రోజుల్లో రూ.100 కోట్లు-దురంధర్ వ‌చ్చేది ఈ ఓటీటీలోకే!

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి. 

Published on: Dec 08, 2025 6:07 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.100 కోట్లు దాటేశాయి. రూ.150 కోట్లకు చేరువయ్యాయి. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'దురంధర్' డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనను అందుకుంది ఈ సినిమా.

రణ్‌వీర్ సింగ్
రణ్‌వీర్ సింగ్

దురంధర్ కలెక్షన్లు

దురంధర్ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించింది. తొలి రోజు వసూళ్లలో 'సయ్యారా'ను సులభంగా అధిగమించిన ఈ స్పై థ్రిల్లర్ దురంధర్.. ఫస్ట్ వీకెండ్ లోనే వంద కోట్లను కొల్లగొట్టింది. సక్నిల్క్ నివేదిక ప్రకారం ఇండియాలో దురంధర్ మూడు రోజుల్లో రూ.118 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఇంకా ఎక్కువే.

ఇండియాలో నెట్ వసూళ్లు

సక్నిల్క్ నివేదికల ప్రకారం దురంధర్ తొలి రోజు భారతదేశంలో రూ.27 కోట్లు నెట్ వసూలు చేసింది. శనివారం 14.29% వృద్ధిని చూపిస్తూ రూ.32 కోట్లు వసూలు చేసి, మొత్తం రూ.59 కోట్లకు చేరుకుంది. ఆదివారం కూడా ఇదే ఊపును కొనసాగిస్తూ, సినిమా రూ.39.50 కోట్లు వసూలు చేసింది. దీంతో దేశీయ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.90 కోట్ల మార్కును దాటింది. ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.99.50 కోట్లకు చేరుకుంది.

బలమైన మౌత్ పబ్లిసిటీ దురంధర్ కు బాగా కలిసి వస్తోందని స్పష్టమవుతోంది. ఏదేమైనప్పటికీ, ఇది రణ్‌వీర్ అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్‌గా నిలిచింది. 'పద్మావత్' (రూ.78 కోట్లు), 'సింబా' (రూ.75.11 కోట్లు), 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహానీ' (రూ.46.81 కోట్లు) వంటి తన మునుపటి చిత్రాల తొలి వారాంతపు వసూళ్లను అధిగమించింది.

దురంధర్ ఓటీటీ

బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతున్న దురంధర్ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది. రణ్‌వీర్ సింగ్‌ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ మంచి ధరకు కొనుగోలు చేసిందని తెలిసింది. అంటే దురంధర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతుంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు 8 వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి వస్తాయి. ఈ లెక్కన చూసుకుంటే జనవరి 30, 2026న దురంధర్ ఓటీటీలో అడుగుపెట్టే అవకాశముంది.

దురంధర్ గురించి..

ఈ స్పై థ్రిల్లర్.. తీవ్రవాద నెట్‌వర్క్‌లపై నిఘా సమాచారాన్ని అందించడానికి లైరాయ్ గ్యాంగ్‌లోకి చొరబడే భారతీయ ఆపరేటివ్‌గా రణ్‌వీర్ సింగ్‌ను చూపిస్తుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా 2000ల ప్రారంభ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు సారా అర్జున్, రాకేష్ బేడీ కూడా ముఖ్య పాత్రలు పోషించారు.