Dill Raju: డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మరో మూవీ ‘గాయపడ్డ సింహం’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. గాయపడ్డ సింహం ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.
గాయపడ్డ సింహం రివ్యూ

తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ మూవీ ‘గాయపడ్డ సింహం’. ఈ మూవీ ట్రైలర్ ను శనివారం (ఏప్రిల్ 25) రాత్రి రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో మూవీపై దిల్ రాజు కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. టాలీవుడ్ లోని అయిదుగురు హీరోలను గాయపడ్డ సింహంలో వాడేశారని, మూవీని ఎంజాయ్ చేస్తారని దిల్ రాజు రివ్యూ చెప్పేశాడు.
ట్రంప్ కూడా హీరోనే
గాయపడ్డ సింహం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ కశ్యప్ గురించి ఎక్కువ చెప్పాలి. నేను సినిమా చూశా. కాన్సెప్ట్ బాగుందనిపించి మూవీ కొనేశా. కానీ సినిమా చూసేవరకూ టెన్షన్. సినిమాలో ఇద్దరు హీరోలు. ట్రంప్ కూడా హీరోనే. ట్రంప్ ను పెట్టుకుని, ఓ కాన్సెప్ట్ తో మూవీ తీశారు’’ అని దిల్ రాజు చెప్పాడు.
అయిదుగురు హీరోలను
‘‘మా హీరో (తరుణ్ భాస్కర్) ఇంకో మూవీని డైరెక్ట్ చేస్తూ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఉందని అర్థమైంది కదా. సినిమా అంతా ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు కశ్యప్. ఈ ఇద్దరు హీరోలనే కాకుండా మరో అయిదుగురు హీరోలను కూడా వాడేశారు. ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ్, యష్, మన అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ)ని వాడేశారు’’ అని దిల్ రాజు రివీల్ చేశాడు.
ఆ ఎపిసోడ్లు
‘‘ఫస్టాఫ్ అంతా ఫన్ తో నవ్విస్తూ, సెకండాఫ్ లో ఈ అయిదుగురు హీరోలకు సంబంధించి అయిదు ఎపిసోడ్లుగా డిజైన్ చేసి ఫుల్ గా ఎంటర్ టైన్ చేశారు. మీరు థియేటర్లో ఆ అయిదు ఎపిసోడ్లు ఎంజాయ్ చేస్తే ఇది ఇంకో జాతిరత్నం, మనీ సినిమాల అవుతుంది. కశ్యప్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు ఆదరిస్తే మరో తరుణ్ భాస్కర్ లా అవుతాడు. కశ్యప్ ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కూడా చేశాడు.
{{/usCountry}}‘‘ఫస్టాఫ్ అంతా ఫన్ తో నవ్విస్తూ, సెకండాఫ్ లో ఈ అయిదుగురు హీరోలకు సంబంధించి అయిదు ఎపిసోడ్లుగా డిజైన్ చేసి ఫుల్ గా ఎంటర్ టైన్ చేశారు. మీరు థియేటర్లో ఆ అయిదు ఎపిసోడ్లు ఎంజాయ్ చేస్తే ఇది ఇంకో జాతిరత్నం, మనీ సినిమాల అవుతుంది. కశ్యప్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు ఆదరిస్తే మరో తరుణ్ భాస్కర్ లా అవుతాడు. కశ్యప్ ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కూడా చేశాడు.
{{/usCountry}}శ్రీ విష్ణుకు థ్యాంక్స్ చెప్పాలి. సెకండాఫ్ లో ఆ అయిదుగురు హీరోలతో పాటు శ్రీ విష్ణు ఎపిసోడ్ బాగా వచ్చింది. శ్రీ విష్ణు ఇందులో యాక్ట్ చేయడం సినిమాకు చాలా ప్లస్ అయింది. జేడీ ఏమో ఫస్టాఫ్ లో విలన్, సెకండాఫ్ లో కమెడియన్’’ అని దిల్ రాజు పేర్కొన్నాడు.