సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’ (The Kerala Story 2) విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
అనురాగ్ కశ్యప్ ఘాటు విమర్శలు

ముఖ్యంగా ఒక ముస్లిం కుటుంబం, ఒక అమ్మాయికి బలవంతంగా గొడ్డు మాంసం (బీఫ్) తినిపించే సన్నివేశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొచ్చిలో జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకకు హాజరైన దర్శకుడు అనురాగ్ కశ్యప్ను మీడియా ప్రతినిధులు ఈ సినిమా ట్రైలర్ గురించి ప్రశ్నించగా, ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
బీఫ్ అలా తినిపిస్తారా?
"అదొక చెత్త సినిమా, పక్కా ప్రచార చిత్రం (Propaganda). అంతా అబద్ధం. ఎవరైనా బీఫ్ అలా తినిపిస్తారా? కనీసం కిచిడీ కూడా ఎవరూ అలా తినిపించరు. ఇదంతా ఒక నాన్సెన్స్" అని అనురాగ్ కశ్యప్ తీవ్రంగా మండిపడ్డారు.
అంతేకాకుండా, "నిర్మాతలు కేవలం డబ్బు సంపాదించడానికి, సమాజాన్ని విడదీయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా తీసిన వారు అత్యాశపరులు. అందరినీ ప్రసన్నం చేసుకుంటూ కోట్లు గడించడమే వారి లక్ష్యం" అని అనురాగ్ కశ్యప్ ఎద్దేవా చేశారు.
రంగంలోకి కేరళ ముఖ్యమంత్రి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ది కేరళ స్టోరీ 2పై సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ వంటి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రాన్ని ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించడాన్ని ఆయన ఖండించారు.
"అబద్ధపు ప్రచారాలతో కేరళ లౌకిక పునాదులను దెబ్బతీయాలని చూస్తున్నారు. కేరళ కీర్తిని మసకబార్చే ఇలాంటి ప్రయత్నాలను ప్రజలందరూ ఐక్యంగా తిరస్కరించాలి" అని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పిలుపునిచ్చారు.
నిర్మాత వివరణ
{{/usCountry}}"అబద్ధపు ప్రచారాలతో కేరళ లౌకిక పునాదులను దెబ్బతీయాలని చూస్తున్నారు. కేరళ కీర్తిని మసకబార్చే ఇలాంటి ప్రయత్నాలను ప్రజలందరూ ఐక్యంగా తిరస్కరించాలి" అని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పిలుపునిచ్చారు.
నిర్మాత వివరణ
{{/usCountry}}మరోవైపు, ఈ విమర్శలపై నిర్మాత విపుల్ అమృత్లాల్ షా స్పందిస్తూ.. ఈ సినిమా భారత న్యాయ వ్యవస్థలోని వాస్తవ కేసుల ఆధారంగానే రూపొందించామని తెలిపారు. కేవలం ముగ్గురు అమ్మాయిల కథే కాకుండా, దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఇతర సంఘటనలను కూడా ఇందులో జోడించామని ఆయన వివరించారు.
సెన్సార్ బోర్డు (CBFC) నుంచి 'U/A' సర్టిఫికేట్ పొందిన ది కేరళ స్టోరీ 2 ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది. వివాదాల నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.