‘జవాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అట్లీ, నటి దీపికా పదుకోన్ మరోసారి జతకట్టనున్నారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రాబోయే ‘AA22xA6’ అనే తెలుగు సినిమాలో దీపిక నటించనుంది. ఇండియా టుడేతో మాట్లాడుతూ అట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి, దీపికా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మూవీ ఎవరి ఊహకు అందని రీతిలో అత్యంత భారీగా ఉండబోతున్నట్లు చెప్పాడు.
నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం..

అల్లు అర్జున్, దీపికా పదుకోన్ మూవీ గురించి డైరెక్టర్ అట్లీ మాట్లాడాడు. తాము ప్రేక్షకుల కోసం చాలా భారీ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నామని చెప్పాడు.
"ప్రతి రోజూ మేము ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొంటున్నాం. సినిమా గురించి వినడానికి అందరూ ఎంత ఆశగా ఉన్నారో నాకు తెలుసు. నిజాయితీగా చెప్పాలంటే ప్రేక్షకుల కంటే ఎక్కువగా నేను వారికి అన్నీ చెప్పడానికి ఎదురుచూస్తున్నాను. దీనికోసం మేము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. దీనిని సాకుగా చెప్పడం లేదు. ప్రతి ఒక్కరి కోసం ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాం. మేము కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాం. ఇది పూర్తయ్యాక అందరూ దీన్ని చాలా బాగా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను" అని అట్లీ పేర్కొన్నాడు.
దీపికా నా లక్కీ ఛార్మ్..
దీపికాతో మళ్లీ పని చేయడంపై అట్లీ సంతోషం వ్యక్తం చేశాడు. "అవును.. ఆమె నా లక్కీ ఛార్మ్. దీపికాతో ఇది నా రెండో సినిమా. ఆమెతో పని చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. తల్లి అయిన తర్వాత ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇది. ఇందులో మీరు కచ్చితంగా సరికొత్త దీపికాను చూస్తారు" అని ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు.
అల్లు అర్జున్, అట్లీ సినిమా విశేషాలు..
సందీప్ రెడ్డి వంగా సినిమా 'స్పిరిట్' నుంచి తప్పుకున్న తర్వాత, గతేడాది దీపిక ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్, అట్లీ తొలిసారి కలిసి పని చేస్తున్నారు. "రాణి జయించడానికి వస్తోంది" అంటూ సన్ పిక్చర్స్ దీపికకు వెల్కమ్ చెప్పింది. 'కల్కి 2898 ఏడీ' తర్వాత దీపికా నటిస్తున్న రెండో తెలుగు పాన్-ఇండియా సినిమా ఇది.
దీపికా ఇతర సినిమాలు..
{{/usCountry}}సందీప్ రెడ్డి వంగా సినిమా 'స్పిరిట్' నుంచి తప్పుకున్న తర్వాత, గతేడాది దీపిక ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్, అట్లీ తొలిసారి కలిసి పని చేస్తున్నారు. "రాణి జయించడానికి వస్తోంది" అంటూ సన్ పిక్చర్స్ దీపికకు వెల్కమ్ చెప్పింది. 'కల్కి 2898 ఏడీ' తర్వాత దీపికా నటిస్తున్న రెండో తెలుగు పాన్-ఇండియా సినిమా ఇది.
దీపికా ఇతర సినిమాలు..
{{/usCountry}}నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 ఏడీ'లో దీపికా చివరిగా కనిపించింది. అయితే ఆ సినిమా సీక్వెల్ నుంచి ఆమెను గతేడాది తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్లతో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.