...
...
Next Story

UBS Trolls: ఉస్తాద్ భగత్ సింగ్‌పై విమర్శలు- తల్లిదండ్రులే ట్రోల్ చేశారన్న హరీష్ శంకర్- అడ్రస్ కూడా చెప్పుకోలేని వారంటూ!

Harish Shankar On Ustaad Bhagat Singh Trolls: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడం, సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ కామెంట్స్‌పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. పనికిమాలిన ట్రోల్స్‌ను తాను పట్టించుకోనని, బూతులు మాట్లాడితే కంప్లైంట్ చేస్తానని తేల్చి చెప్పారు.

Published on: Mar 26, 2026, 06:33:31 IST
Advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సృష్టిస్తున్న సునామీ ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపింది.

ఉస్తాద్ భగత్ సింగ్‌పై విమర్శలు- తల్లిదండ్రులే ట్రోల్ చేశారన్న హరీష్ శంకర్- అడ్రస్ కూడా చెప్పుకోలేని వారంటూ!
ఉస్తాద్ భగత్ సింగ్‌పై విమర్శలు- తల్లిదండ్రులే ట్రోల్ చేశారన్న హరీష్ శంకర్- అడ్రస్ కూడా చెప్పుకోలేని వారంటూ!

పాన్ ఇండియా స్థాయిలో ‘ధురంధర్ 2’ రికార్డులు తిరగరాస్తుండటంతో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్‌పై వస్తున్న విమర్శలపై దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా స్పందించారు.

నిర్మాణాత్మక విమర్శలే ముఖ్యం: హరీష్ శంకర్

ఒక అభిమానుల సమావేశంలో పాల్గొన్న హరీష్ శంకర్ ఈ సినిమాకు వస్తున్న మిశ్రమ స్పందనపై స్పందిస్తూ.. "ట్రోలర్లు ఏమైనా అనుకోవచ్చు, అది వారి ఇష్టం. కానీ నేను నిర్మాణాత్మకమైన విమర్శలను మాత్రమే స్వీకరిస్తాను" అని చెప్పారు.

"ఉదాహరణకు.. ‘ఫలానా సీన్ ఇంకా బాగా రాయాల్సింది’ లేదా ‘ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా ఉంది’ అని చెబితే తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాను. అంతేకానీ, గుర్తు తెలియని వ్యక్తులు చేసే ట్రోల్స్‌ను నేను సీరియస్‌గా తీసుకోను. తమ అడ్రస్ కూడా చెప్పుకోలేని వారి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు" అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.

"హద్దులు దాటితే బ్లాక్ చేస్తాను"

ట్రోలింగ్ గురించి ఆయన మరింత ఘాటుగా స్పందిస్తూ.. "నేను ఏదైనా మాట్లాడితే దానికి బాధ్యత వహిస్తాను. చీకట్లో ఉండి రాళ్లు వేసే వారి పరిస్థితి అలా కాదు. ఒకవేళ నేను ట్రోల్స్ చూసి భయపడి ఉంటే ఎప్పుడో ట్విట్టర్ (X) వదిలేసేవాడిని" అని అన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. విజయ్ నటించిన ‘తేరి’ (2016) చిత్రానికి రీమేక్ అని విమర్శలు వస్తున్నాయి. 2023 నుంచి నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా సంగీతాన్ని అందించారు.

ఇంకా దాటని 100 కోట్ల మార్క్

భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, వారం రోజులు గడిచినా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇంకా రూ. 100 కోట్ల మార్కును దాటలేదు. ఒకవైపు ‘ధురంధర్ 2’ ప్రభావం, మరోవైపు కథలో కొత్తదనం లేదన్న విమర్శలు సినిమా కలెక్షన్స్‌ను దెబ్బతీశాయి.

నెరవేరని భారీ అంచనాలు

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్-పవన్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా కావడంతో అభిమానులు పెట్టుకున్న అంచనాలు పూర్తిస్థాయిలో నెరవేరలేదనే చెప్పాలి. కాగా, ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర వంటి తారలు కీలక పాత్రల్లో నటించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe