రజనీకాంత్.. నువ్వో నకిలీ దాత.. యూనిఫామ్ వేసుకుంటేనే గుర్తు పడతావా.. వాళ్లు నిరసన తెలుపుతుంటే ఏం చేశావ్: డైరెక్టర్ ట్వీట్

చెన్నైలో నిజాయితీ చాటుకున్న పారిశుధ్య కార్మికురాలికి సూపర్ స్టార్ రజనీకాంత్ బంగారు గొలుసు బహుమతిగా ఇవ్వడం అందరి ప్రశంసలు పొందింది. అయితే దీనిపై తమిళ దర్శకుడు లెనిన్ భారతి సంచలన విమర్శలు చేశాడు. కార్మికుల హక్కుల కోసం పోరాటం జరిగినప్పుడు రజనీకాంత్ ఎక్కడున్నారని ప్రశ్నించాడు.

Published on: Feb 06, 2026 4:17 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూపర్ స్టార్ రజనీకాంత్ పై తమిళ డైరెక్టర్ లెనిన్ భారతి చేసిన కామెంట్స్ షాకింగ్ కు గురి చేస్తున్నాయి. రజనీ ఓ నకిలీ దాత అంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈమధ్యే రజనీకాంత్ చేసిన ఓ సాయంపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. లెనిన్ మాత్రం విమర్శలు చేయడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

రజనీకాంత్.. నువ్వో నకిలీ దాత.. యూనిఫామ్ వేసుకుంటేనే గుర్తు పడతావా.. వాళ్లు నిరసన తెలుపుతుంటే ఏం చేశావ్: డైరెక్టర్ ట్వీట్
రజనీకాంత్.. నువ్వో నకిలీ దాత.. యూనిఫామ్ వేసుకుంటేనే గుర్తు పడతావా.. వాళ్లు నిరసన తెలుపుతుంటే ఏం చేశావ్: డైరెక్టర్ ట్వీట్

"అప్పుడు ఎక్కడున్నావ్ రజనీ?"

ఇటీవల చెన్నైకి చెందిన పద్మ అనే పారిశుధ్య కార్మికురాలు.. తన విధి నిర్వహణలో దొరికిన 45 సవర్ల బంగారాన్ని నిజాయతీగా పోలీసులకు అప్పగించి అందరి మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ఆమెను తన పోయెస్ గార్డెన్ ఇంటికి పిలిపించుకుని సత్కరించి, ఓ బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీనిపై అందరూ రజనీని మెచ్చుకుంటుంటే.. ‘మెర్కు తొడర్చి మలై’ సినిమా దర్శకుడు లెనిన్ భారతి మాత్రం రజనీకాంత్‌పై విరుచుకుపడ్డాడు. ఎక్స్ వేదికగా అతడు స్పందిస్తూ.. "రిప్పన్ బిల్డింగ్ (చెన్నై కార్పొరేషన్ ఆఫీస్) ముందు పారిశుధ్య కార్మికులు తమ హక్కుల కోసం నిరసనలు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావ్ రజనీకాంత్? కేవలం నీ దాతృత్వాన్ని ప్రదర్శించుకోవడానికి మాత్రమే యూనిఫాంలో ఉన్న వారిని గుర్తిస్తావా? నువ్వొక ఫేక్ ఫిలాంత్రోపిస్ట్ (నకిలీ దాత)" అని తమిళంలో ఘాటుగా రాసుకొచ్చాడు.

సోషల్ మీడియాలో వార్..

లెనిన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. దీనిపై రజనీకాంత్ ఫ్యాన్స్ మొదట స్పందించారు. "ప్రతిదానికీ తప్పులు వెతకడం సరికాదు" అని కొందరు అంటే.. "కార్మికుల సమస్యలు తీర్చాల్సింది ప్రభుత్వం, రజనీకాంత్ కాదు" అని మరికొందరు సమర్థిస్తున్నారు.

లెనిన్ వాదనను సమర్థిస్తూ.. "నిజమైన కార్మికుల హక్కుల గురించి మాట్లాడని వ్యక్తి, కేవలం ఫొటోషూట్‌ల కోసం ఇలా చేయడం సరికాదు" అని కామెంట్స్ చేస్తున్నారు.

ఎవరీ లెనిన్ భారతి?

లెనిన్ భారతి సామాజిక స్పృహ ఉన్న చిత్రాలకు పెట్టింది పేరు. విజయ్ సేతుపతి నిర్మించిన 'మెర్కు తొడర్చి మలై' (2018) సినిమాతో అతడు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా భూమి లేని నిరుపేద కూలీల జీవితాల చుట్టూ తిరుగుతుంది.

ఏది ఏమైనా ఒక మంచి పని వివాదానికి దారి తీయడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్ గతేడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రంలో నటించారు. త్వరలో 'జైలర్ 2' సెట్స్ పైకి వెళ్లనున్నాడు.