...
...
Next Story

Director Son Arrest: హైదరాబాద్‌లో పోలీసుల విధులకు ఆటంకం, హోంగార్డుపై దాడి- దర్శకుడు మణిశంకర్ కొడుకు ప్రేమ్ శంకర్ అరెస్ట్

Director Mani Shankar Son Prem Shankar Arrest: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించిన కేసులో దర్శకుడు మణిశంకర్ కుమారుడు ప్రేమ్ శంకర్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Published on: Mar 5, 2026, 11:31:33 IST
Advertisement

ప్రముఖ సినీ దర్శకుడు మణిశంకర్ కుమారుడు ప్రేమ్ శంకర్ (40) వివాదంలో చిక్కుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకోవడమే కాకుండా, ఒక హోంగార్డుపై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ప్రేమ్ శంకర్‌ను అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?

హైదరాబాద్‌లో పోలీసుల విధులకు ఆటంకం, హోంగార్డుపై దాడి- దర్శకుడు మణిశంకర్ కొడుకు ప్రేమ్ శంకర్ అరెస్ట్
హైదరాబాద్‌లో పోలీసుల విధులకు ఆటంకం, హోంగార్డుపై దాడి- దర్శకుడు మణిశంకర్ కొడుకు ప్రేమ్ శంకర్ అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన మార్చి 1వ తేదీన చోటుచేసుకుంది. ప్రేమ్ శంకర్ తన ఎలక్ట్రిక్ కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 మీదుగా వెళ్తుండగా, ఒక జంక్షన్ సమీపంలో కారు బ్యాటరీ నిలిచిపోయింది. దీంతో కారు ప్రధాన రహదారిపైనే ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్, హోంగార్డు అక్కడికి చేరుకున్నారు.

ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి కారును పక్కకు జరపాలని వారు కోరారు. అయితే ప్రేమ్ శంకర్ అందుకు నిరాకరించడమే కాకుండా, కారులో నుంచి దిగడానికి ససేమిరా అన్నారు. వాహనాన్ని తరలించే క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగి, హోంగార్డును పక్కకు తోసేసి దాడికి పాల్పడ్డారు.

సహకరించమని కోరిన కానిస్టేబుల్, హోంగార్డ్

"కారును పక్కకు జరపడానికి సహకరించమని కానిస్టేబుల్, హోంగార్డు ఎంత వేడుకున్నా ప్రేమ్ శంకర్ వినలేదు. బయటకు రావడానికి నిరాకరిస్తూ హోంగార్డును నెట్టేశారు" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఆ తర్వాత పోలీసులు ప్రేమ్ శంకర్‌ను బలవంతంగా కారులో నుంచి దించి, వాహనాన్ని పక్కకు జరిపారు. అయితే ఆ సమయంలో ప్రేమ్ శంకర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, గాలింపు చేపట్టి బుధవారం (మార్చి 4) ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

దర్శకుడు మణిశంకర్ నేపథ్యం

కేవలం సినిమాలే కాకుండా, టెక్నాలజీ పరంగానూ మణిశంకర్‌కు మంచి పేరుంది. భారత్‌కు ‘హోలోగ్రామ్’ సాంకేతికతను పరిచయం చేసిన ఘనత ఆయనదే. 2012 గుజరాత్ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కోసం ఆయన వినూత్నంగా ప్రచారాన్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్), ఎన్సీపీ వంటి పార్టీల ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా మణిశంకర్ నిర్వహించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe