ప్రముఖ సినీ దర్శకుడు మణిశంకర్ కుమారుడు ప్రేమ్ శంకర్ (40) వివాదంలో చిక్కుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకోవడమే కాకుండా, ఒక హోంగార్డుపై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ప్రేమ్ శంకర్ను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన మార్చి 1వ తేదీన చోటుచేసుకుంది. ప్రేమ్ శంకర్ తన ఎలక్ట్రిక్ కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 మీదుగా వెళ్తుండగా, ఒక జంక్షన్ సమీపంలో కారు బ్యాటరీ నిలిచిపోయింది. దీంతో కారు ప్రధాన రహదారిపైనే ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్, హోంగార్డు అక్కడికి చేరుకున్నారు.
ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి కారును పక్కకు జరపాలని వారు కోరారు. అయితే ప్రేమ్ శంకర్ అందుకు నిరాకరించడమే కాకుండా, కారులో నుంచి దిగడానికి ససేమిరా అన్నారు. వాహనాన్ని తరలించే క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగి, హోంగార్డును పక్కకు తోసేసి దాడికి పాల్పడ్డారు.
సహకరించమని కోరిన కానిస్టేబుల్, హోంగార్డ్
"కారును పక్కకు జరపడానికి సహకరించమని కానిస్టేబుల్, హోంగార్డు ఎంత వేడుకున్నా ప్రేమ్ శంకర్ వినలేదు. బయటకు రావడానికి నిరాకరిస్తూ హోంగార్డును నెట్టేశారు" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఆ తర్వాత పోలీసులు ప్రేమ్ శంకర్ను బలవంతంగా కారులో నుంచి దించి, వాహనాన్ని పక్కకు జరిపారు. అయితే ఆ సమయంలో ప్రేమ్ శంకర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, గాలింపు చేపట్టి బుధవారం (మార్చి 4) ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
దర్శకుడు మణిశంకర్ నేపథ్యం
ఇకపోతే హైదరాబాద్కు చెందిన మణిశంకర్ బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడిగా, స్క్రీన్ రైటర్గా పేరు తెచ్చుకున్నారు. 1991లో ‘మనిషి’ చిత్రంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మణిశంకర్ 2002లో వచ్చిన ‘16 డిసెంబర్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘రుద్రాక్ష్’, ‘టాంగో చార్లీ’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన చివరి చిత్రం ‘హే కామిని’ 2023లో విడుదలైంది.
హోలోగ్రామ్ సాంకేతికత
{{/usCountry}}ఇకపోతే హైదరాబాద్కు చెందిన మణిశంకర్ బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడిగా, స్క్రీన్ రైటర్గా పేరు తెచ్చుకున్నారు. 1991లో ‘మనిషి’ చిత్రంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మణిశంకర్ 2002లో వచ్చిన ‘16 డిసెంబర్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘రుద్రాక్ష్’, ‘టాంగో చార్లీ’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన చివరి చిత్రం ‘హే కామిని’ 2023లో విడుదలైంది.
హోలోగ్రామ్ సాంకేతికత
{{/usCountry}}కేవలం సినిమాలే కాకుండా, టెక్నాలజీ పరంగానూ మణిశంకర్కు మంచి పేరుంది. భారత్కు ‘హోలోగ్రామ్’ సాంకేతికతను పరిచయం చేసిన ఘనత ఆయనదే. 2012 గుజరాత్ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కోసం ఆయన వినూత్నంగా ప్రచారాన్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్), ఎన్సీపీ వంటి పార్టీల ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా మణిశంకర్ నిర్వహించారు.