Meher Ramesh: తెలుగు చిత్రసీమలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన మెహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మొన్ననే కుమార్తె పెళ్లిని అతను అంగరంగ వైభవంగా జరిపించాడు. కానీ ఇప్పుడేమో అతని చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర అకాల మరణం చెందడంతో మెహర్ రమేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
మెహర్ రమేష్ అక్క మరణం

డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. గత రెండు వారాలుగా (14 రోజులుగా) తీవ్రమైన వైరల్ న్యుమోనియా సమస్యతో ఆమె బాధపడ్డారు.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. జూలై 21 రాత్రి ఆమె పరిస్థితి క్షీణించి, రాత్రి 9.45 గంటలకు విజయవాడలో జ్యోతి తుదిశ్వాస విడిచినట్లు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతను తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాడు.
పెళ్లి సందడి తీరకముందే ఘోరం
ఈ సోదరి మరణం మెహర్ రమేష్ కుటుంబాన్ని మరింత వేదనకు గురిచేయడానికి ప్రధాన కారణం.. కొద్ది రోజుల క్రితమే జరిగిన సంఘటన. ఈ జూలై 1న మెహర్ రమేష్ కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఆ వేడుకకు మెహర్ జ్యోతి హాజరై, కుటుంబ సభ్యులందరితో ఎంతో సంతోషంగా గడిపారు.
పెళ్లి సందడి ముగిసి, ఆ జ్ఞాపకాల నుంచి తేరుకోకముందే ఆమె అనారోగ్యం బారినపడి కన్నుమూయడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తదితర ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సంతాపం
{{/usCountry}}పెళ్లి సందడి ముగిసి, ఆ జ్ఞాపకాల నుంచి తేరుకోకముందే ఆమె అనారోగ్యం బారినపడి కన్నుమూయడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తదితర ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సంతాపం
{{/usCountry}}మెహర్ రమేష్ అక్క మృతి వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మెహర్ రమేష్ అత్యంత ఆప్తుడు కావడంతో, మెగా కాంపౌండ్తో పాటు టాలీవుడ్ అగ్ర నటీనటులు మెహర్ రమేష్ను పరామర్శిస్తూ ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఫ్యాన్స్ కు షాక్
మెహర్ రమేష్ ఫ్యాన్స్ కు కూడా ఈ వార్త షాక్ కలిగించింది.
‘‘నా ప్రియమైన చిన్నక్క “మెహెర్ జ్యోతి సుంకర ”. ఈ రోజు 9:45 pm కి విజయవాడ లో స్వర్గస్తులైనారు. వైరల్ న్యూమోనియా తో గత 14 రోజులు గా చికిత్స పొందుతూ అనంత లోకాలకి వెళ్లి పోయారు. నా చిన్నప్పటి నుంచి తను నా అండ. ప్రేమ గా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి ,శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనంద పడిన మా అక్క ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకి ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు’’ అని మెహర్ రమేష్ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు.