...
...
Next Story

ధురంధర్ విజయం తలకెక్కింది- అతను విషపూరితం- దృశ్యం 3 నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నాపై నిర్మాత ఫైర్- లీగల్ నోటీసులు

బ్లాక్ బస్టర్ ధురంధర్ విజయంతో ఆ మూవీ నటులంతా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాపై మాత్రం సంచలన ఆరోపణలు వస్తున్నాయి. దృశ్యం 3 నుంచి అతను తప్పుకోవడమే అందుకు కారణం. అక్షయ్ ఖన్నాకు ధురంధర్ విజయం తలకెక్కిందని దృశ్యం 3 ప్రొడ్యూసర్ అన్నాడు.

Published on: Dec 27, 2025, 17:37:15 IST
Advertisement

ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా యాక్టింగ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ మరోవైపు మాత్రం సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న దృశ్యం 3 సినిమా షూటింగ్ నుంచి అతను తప్పుకోవడమే ఇందుకు కారణం. అక్షయ్ ఖన్నాకు ధురంధర్ విజయం తలకెక్కిందని దృశ్యం 3 ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ పాఠక్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ చెప్పాడు.

ఇదే కారణం

అక్షయ్ ఖన్నా
అక్షయ్ ఖన్నా

దృశ్యం 3 సినిమా నుంచి అక్షయ్ ఖన్నా తప్పుకోవడం వెనుక ఉన్న కారణాలను మంగత్ పాఠక్ వెల్లడించాడు. అంతే కాకుండా అతని స్థానంలో జైదీప్ అహ్లావత్ ను తీసుకున్నట్లు చెప్పాడు. ఛావా, ధురంధర్ విజయాలతో అక్షయ్ ఖన్నా తన రెమ్యునరేషన్ రూ.21 కోట్లకు పెంచాడని, అలాగే దృశ్యం 3 లో విగ్ వాడతానని చెప్పాడని పాఠక్ పేర్కొన్నాడు. దృశ్యం 2లో అక్షయ్ బట్టతలతో కనిపించాడు.

లీగల్ నోటీస్

శనివారం (డిసెంబర్ 27) నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ.. "అతని (అక్షయ్ ఖన్నా) ప్రవర్తన వల్ల నేను నష్టపోయా. నేను చట్టపరమైన చర్య తీసుకుంటా. ఇప్పటికే అతనికి లీగల్ నోటీసు పంపా. అతను ఇంకా స్పందించలేదు" అని తెలిపాడు. దృశ్యం సినిమాలో అక్షయ్ ఖన్నా ఐజి తరుణ్ అహ్లావత్ పాత్ర పోషిస్తున్నాడు. అతను తన కొడుకు హత్యకు విజయ్ సాలగాంకర్ (అజయ్ దేవ్‌గణ్) ను జైలుకు పంపాలని కోరుకుంటాడు.

రెమ్యునరేషన్

అక్షయ్ ఖన్నా దృశ్యం 3 రెమ్యునరేషన్ ను మూడు సార్లు చర్చించామని మంగత్ పాఠక్ అన్నాడు. అతను రూ.21 కోట్లు డిమాండ్ చేశాడని చెప్పాడు. తన జీతాన్ని మూడు సార్లు చర్చించినప్పటికీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత నిర్మాత కాల్స్ కు స్పందించడం మానేశారని సమాచారం. అక్షయ్ పారితోషికంపై అంగీకారం తెలిపిన తర్వాత వెనక్కి తగ్గారని నిర్మాత ఆరోపించాడు. ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. అయితే షూట్ కు 10 రోజుల ముందు పని చేయడానికి నిరాకరించాడు.

విగ్గు వివాదం

"అక్షయ్ ఖన్నా విషపూరితమైన వాడు. ఒకప్పుడు అతను జీరో. అప్పుడే నేను అతనితో సెక్షన్ 375 (2019) తీశాను. అప్పుడు కూడా, అతని వృత్తిపరమైన ప్రవర్తన కారణంగా అతనితో పనిచేయవద్దని చాలా మంది మాకు చెప్పారు. సెట్ లో అతని శక్తి చాలా విషపూరితమైనది. సెక్షన్ 375 అతనికి గుర్తింపు తెచ్చింది. తరువాత నేను అతనిని దృశ్యం 2 (2022) లో తీసుకున్నాను. దృశ్యం 2 తర్వాతే అతనికి అన్ని పెద్ద ఆఫర్లు వచ్చాయి. అంతకుముందు అతను 3-4 సంవత్సరాలు ఇంట్లో కూర్చునే ఉన్నాడు" అని పాఠక్ అన్నాడు.

విజయం తలకెక్కింది

"ఒకవేళ అతను సూపర్ స్టార్ అయ్యానని నమ్మితే, పెద్ద బడ్జెట్ తో సొంత సినిమా చేసి, దానికి ఎవరు మద్దతు ఇస్తారో చూసుకోవాలి" అని కుమార్ అన్నాడు. ధురంధర్ విజయం తలకెక్కిందని కుమార్ ఆరోపించాడు. అక్షయ్ ఖన్నా ఈ ఆరోపణలకు ఇంకా స్పందించలేదు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks