...
...
Next Story

Etv: ఈటీవీ బిగ్ ప్లాన్.. టీవీ సండే టీఆర్పీ గేమ్ లో అదిరే ట్విస్ట్.. రేపటి నుంచి మూడు షోలు.. ప్రదీప్, సుధీర్, రష్మి రచ్చ!

Etv: ఈ ఆదివారం నుంచి ఈటీవీ ప్రైమ్‌టైమ్‌లో భారీ మార్పులు జరిగాయి. బుల్లితెర టీఆర్పీ రేటింగ్ గేమ్ లో దూసుకెళ్లేలా ఈటీవీ కొత్త ప్లాన్ తో వస్తోంది. ఇక ప్రతి సండే మూడు షోలతో ట్రిపుల్ ధమాకా అందించనుంది. ఆ విశేషాలు ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 25, 2026, 18:47:58 IST
Advertisement

Etv: తెలుగు టెలివిజన్ రంగంలో ఆదివారం నాన్-ఫిక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో టీఆర్‌పీ (TRP Ratings) పోరు సరికొత్త మలుపు తిరిగింది. గత కొన్ని నెలలుగా జీ తెలుగు, స్టార్ మా ఛానళ్లు తమ ఈవెంట్లు, డ్యాన్స్ అండ్ రియాలిటీ షోలతో ఆదివారం ప్రైమ్‌టైమ్‌ను శాసిస్తుండగా, దానికి బలమైన పోటీ ఇచ్చేందుకు ఈటీవీ (ETV) సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. తమ ప్రధాన ప్రోగ్రామ్‌ల టైమింగ్స్, యాంకర్లు, కాన్సెప్ట్‌లను మారుస్తూ నెట్‌వర్క్ నిర్ణయం తీసుకుంది.

రష్మి స్థానంలో ప్రదీప్ మాచిరాజు

ఈటీవీ బిగ్ ప్లాన్.. టీవీ సండే టీఆర్పీ గేమ్ లో అదిరే ట్విస్ట్.. రేపటి నుంచి మూడు షోలు.. ప్రదీప్, సుధీర్, రష్మి రచ్చ! (youtube/ etvteluguindia)
ఈటీవీ బిగ్ ప్లాన్.. టీవీ సండే టీఆర్పీ గేమ్ లో అదిరే ట్విస్ట్.. రేపటి నుంచి మూడు షోలు.. ప్రదీప్, సుధీర్, రష్మి రచ్చ! (youtube/ etvteluguindia)

ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రసారమయ్యే పాపులర్ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' (Sridevi Drama Company) లో మేకర్స్ ఊహించని చేంజ్ చేశారు. ఇప్పటివరకు యాంకర్‌గా వ్యవహరించిన రష్మి గౌతమ్ (Rashmi Gautam) స్థానంలో స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) వచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్, వన్-లైనర్లతో ఒంటిచేత్తో షోను నడిపించగల ప్రదీప్ రాకతో మధ్యాహ్నం స్లాట్‌లో షో టీఆర్‌పీ భారీగా పుంజుకునే అవకాశం ఉంది.

హైపర్ ఆది రీ-ఎంట్రీ

ఇన్నాళ్లూ వారంలో శుక్ర, శనివారాల్లో రాత్రి వేళల్లో అలరించిన కల్ట్ కామెడీ షో 'జబర్దస్త్' (Jabardasth) ను ఈటీవీ ప్రైమ్‌టైమ్ స్లాట్‌కు మార్చింది. ప్రతీ ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు 'జబర్దస్త్' ప్రసారం కానుంది. ఈ స్లాట్ మార్పునకు తోడు, స్టార్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వడం ఈ షోకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆది మార్క్ పొలిటికల్ అండ్ కరెంట్ అఫైర్స్ పంచ్‌లు ఫ్యామిలీ ఆడియన్స్‌ను స్క్రీన్లకు కట్టిపడేసేలా ప్లాన్ చేశారు.

ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2

ఈటీవీ చేపట్టిన ఈ స్లాట్ చేంజ్, ఆర్టిస్టుల ఛేంజ్ వెనుక పక్కా టెలివిజన్ వ్యూహం కనిపిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఛానల్‌కే లాక్ చేసేందుకు ప్రదీప్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ అనే బలమైన ముగ్గురు ఫేస్‌లను ఒకే లైన్‌అప్‌లోకి తేవడం మాస్టర్ ప్లాన్. పోటీ ఛానళ్లలోని సీరియల్స్, సినిమాలకు చెక్ పెడుతూ ఈటీవీ వ్యూహం రాబోయే వారాల్లో సండే టీఆర్‌పీ చాట్స్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe