Prakash Raj On Bandi Bhagirath Case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసుపై అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో స్పందిస్తుండగా…. మరోవైపు సినీ నటులు కూడా రియాక్ట్ అవుతున్నారు.
ఎందుకు అరెస్ట్ చేయట్లేదు..? ప్రకాశ్ రాజ్

తాజాగాఈ వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ ప్రశ్నలు సంధించారు.
బాలికను వేధించారనే ఆరోపణలపై కేసు నమోదై ఇన్ని రోజులవుతున్నా, నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నినదించే "బేటీ బచావో.. బేటీ పడావో" (ఆడపిల్లను కాపాడండి) నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది "బేటా బచావో" (కొడుకును కాపాడండి) లాగా కనిపిస్తోందని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ నేరుగా ప్రశ్నలు సంధించారు. "బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు…?" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ముదురుతున్న వివాదం
ఇప్పటికే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు విపక్షాలు, పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలనే డిమాండ్ పెరుగుతోంది.
{{/usCountry}}ఇప్పటికే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు విపక్షాలు, పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలనే డిమాండ్ పెరుగుతోంది.
{{/usCountry}}ఇక ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సీరియస్ అయ్యారు. తక్షణమే ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించాలని సోమవారం డీజీపీని ఆదేశించిన సంగతి తెలిసిందే. డీజీపీ ఆదేశాల మేరకు…. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెట్ బషీరాబాద్ పోలీసులతో సమావేశమైన డీసీపీ రితిరాజ్… కేసు వివరాలను తెలుసుకున్నారు. బాధితురాలి స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా… మరోవైపు బండి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.