ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్… కాలినడకన తిరుమలకు చేపట్టిన 'సంకల్ప యాత్ర' విజయవంతంగా పూర్తైంది. షాద్నగర్ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత మంగళవారం రోజు తిరులమకు చేరుకున్నారు. సుమారు 535 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు.

అలిపిరి మార్గం నుంచి కాలి నడకన తిరుమలకు బయలుదేరారు. ముందుగా తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గణేష్ను చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందించారు. తన సంకల్ప యాత్రను ముగించిన నేపథ్యంలో ఇవాళ(బుధవారం) తన కుటుంబంతో కలిసి బండ్ల గణేశ్… శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
పాదయాత్ర ఎందుకోసమంటే..?
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయన జైలు నుంచి సురక్షితంగా బయటకు వస్తే హైదరాబాద్ నుంచి తిరుమల వస్తానని బండ్ల గణేశ్ శ్రీవారికి మొక్కుకున్నారు.
తన మొక్కును చెల్లించుకోవటం కోసం జనవరి 19న షాద్నగర్ నుంచి సంకల్ప యాత్ర పేరుతో బండ్ల గణేశ్ పాదయాత్రను ప్రారంభించాడు. 23 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. పలు గ్రామాలు, పట్టణాలను దాటుకుంటూ తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. మార్గమధ్యంలో రాజకీయ నాయకులతో పాటు అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. కూటమిలో ఉన్న పార్టీల నాయకులు… తమ అనుచరులతో కలిసి కొంత మేర బండ్ల గణేశ్ తో కలిసి పాదయాత్ర కూడా చేశారు.
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ కూడా…. బండ్లన్న సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. బండ్ల గణేశ్ తో కలిసి కొద్ది దూరం నడిచాడు. 'నా సంకల్పయాత్రలో ఈ రోజు నాతో అడుగులు వేసిన తమ్ముడు విశ్వక్ సేన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని ఈ సందర్భంగా బండ్ల గణేశ్ ఎక్స్ లో ఓ పోస్ట్ కూడా చేశాడు.
తిరుమలకు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్ భావోద్వేగానికి గురయ్యారు “చాలా ఆనందంగా ఉంది. 23 రోజులు నిరంతరాయంగా పాదయాత్ర చేసి స్వామి వారి చెంతకు వచ్చాను. నా జన్మలో ఇదోక అద్భుతమైన ఘట్టం. ఈ జన్మంతా శ్రీవారి సేవ చేసేందుకు రుణపడి ఉంటాను. ఏడు కొండల వాడి దయతో ఎలాంటి ఆటంకం లేకుండా యాత్రను పూర్తి చేశాను” అని చెప్పుకొచ్చారు.
{{/usCountry}}తిరుమలకు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్ భావోద్వేగానికి గురయ్యారు “చాలా ఆనందంగా ఉంది. 23 రోజులు నిరంతరాయంగా పాదయాత్ర చేసి స్వామి వారి చెంతకు వచ్చాను. నా జన్మలో ఇదోక అద్భుతమైన ఘట్టం. ఈ జన్మంతా శ్రీవారి సేవ చేసేందుకు రుణపడి ఉంటాను. ఏడు కొండల వాడి దయతో ఎలాంటి ఆటంకం లేకుండా యాత్రను పూర్తి చేశాను” అని చెప్పుకొచ్చారు.
{{/usCountry}}