భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్లో పాల్గొనడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంకా సందిగ్ధంలోనే ఉంది. భద్రతా కారణాల రీత్యా భారత్కు రాలేమని చెప్పిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి ఐసీసీ కఠినంగా ఉండటంతో ఆ టీమ్ తప్పుకోక తప్పలేదు. దీనికి నిరసనగా, బంగ్లాదేశ్కు సంఘీభావం తెలుపుతూ తాము కూడా వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్థాన్ యోచిస్తోంది. అయితే ఈ ఆలోచనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.
ఐసీసీతో పెట్టుకుంటే కష్టమే..

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్ ఉల్ హక్, మొహమ్మద్ హఫీజ్, మోసిన్ ఖాన్ వంటి వారు పీసీబీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఐసీసీతో గొడవ పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దీనివల్ల పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంజమామ్ ఉల్ హక్ దీనిపై స్పందిస్తూ.. "పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. మన దగ్గర మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఇలాంటి పెద్ద టోర్నీల్లో రాణించడం మన క్రికెట్కు చాలా అవసరం" అని పీటీఐతో పేర్కొన్నాడు.
మరో మాజీ మోసిన్ ఖాన్ మాట్లాడుతూ.. "మనకు భారత్తో సమస్యలు ఉన్న మాట వాస్తవమే. కానీ మన మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరుగుతున్నాయి కదా? అలాంటప్పుడు జట్టును పంపకపోవడానికి మన దగ్గర సరైన కారణం ఏముంది? ఇది మన క్రికెట్కు చాలా చేటు చేస్తుంది" అని వ్యాఖ్యానించాడు.
పాకిస్థాన్ ప్రధానితో భేటీ..
పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ సోమవారం (జనవరి 26) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యాడు. ఈ భేటీ తర్వాత, వరల్డ్ కప్లో పాల్గొనాలా వద్దా అనే తుది నిర్ణయాన్ని ఫిబ్రవరి 2లోపు తీసుకుంటామని తెలిపాడు. అయితే బాయ్కాట్ చేస్తే ఐసీసీ నుంచి వచ్చే ఇబ్బందులే కాకుండా, దాదాపు 38 మిలియన్ డాలర్ల మేర బ్రాడ్కాస్టర్ల నుంచి దావా ఎదుర్కోవాల్సి వస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.
అర్థం లేని వాదన..
పాకిస్థాన్ వాదనలో అనేక లోపాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్తో సహా పాకిస్థాన్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్.. పాకిస్థాన్ వెళ్ళనప్పుడు దుబాయ్లో మ్యాచ్లు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే హైబ్రిడ్ మోడల్ పాటిస్తున్నప్పుడు, కేవలం బంగ్లాదేశ్ కోసం టోర్నీని వదులుకోవడం అవివేకమని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}పాకిస్థాన్ వాదనలో అనేక లోపాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్తో సహా పాకిస్థాన్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్.. పాకిస్థాన్ వెళ్ళనప్పుడు దుబాయ్లో మ్యాచ్లు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే హైబ్రిడ్ మోడల్ పాటిస్తున్నప్పుడు, కేవలం బంగ్లాదేశ్ కోసం టోర్నీని వదులుకోవడం అవివేకమని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}