గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 536వ ఎపిసోడ్ లో రోహిణి అనుకొని మీనాను కిడ్నాప్ చేస్తారు దినేష్ మనుషులు. అయితే ఆమెను కాపాడటానికి వెళ్లి ప్రమాదంలో పడిని బాలును కూడా ఆ కిడ్నాపర్ల నుంచి కాపాడుతుంది మీనా. ఈ క్రమంలో ఆమె ఉగ్రరూపం చూపిస్తుంది.
నరకాసుర వధ కథ చెప్పిన శృతి, సత్యం.. విద్య ఇంటికి మీనా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ ఇంట్లో దీపావళి వేడుకల హడావిడితో మొదలవుతుంది. మీనా అందరికీ పాయసం చేసి తీసుకొస్తుంది. అప్పుడే వచ్చిన శృతి సత్యభామ, నరకాసుర వధ గురించి తాము ఇప్పుడే ఓ డబ్బింగ్ చెప్పి వచ్చానంటూ అదే భాషలో మాట్లాడుతుంది. ఆ క్రమంలో కృష్ణుడు స్పృహ తప్పి పడిపోతే సత్యభామ ఎలా నరకాసురుడిని చంపిందో శృతి వివరిస్తుంది.
అప్పుడే సత్యం కూడా ఆ కథ గురించి చెబుతూ.. సత్యభామ ధైర్యసాహసాల గురించి చెబుతాడు. అది విని అచ్చూ మీనా కూడా అలాగే ఉంది కదా అని బాలు అంటాడు. అవునని సత్యం అంటాడు. అప్పుడే మీనాకు విద్య ఫోన్ చేసి పూలు కావాలని, ఇంటికి తెచ్చివ్వాలని అడుగుతుంది. సరే ఆమె వెళ్తుంది.
రోహిణికి దినేష్ ఫోన్.. మళ్లీ బ్లాక్మెయిల్
అటు దినేష్.. రోహిణిపై కోపంతో రగిలిపోతుంటాడు. ఎవరో తనను బాగా కొట్టారని అనడంతో అతని పక్కనున్న రౌడీలు అది రోహిణియే అయి ఉంటుందని అనడంతో అతనిలోనూ అనుమానం మొదలవుతుంది. దానిని ఊరికే వదిలిపెట్టను అంటూ.. రోహిణికి దినేష్ మరోసారి ఫోన్ చేస్తాడు. ఆమె కట్ చేస్తున్నా పదే పదే ఫోన్ చేస్తూనే ఉంటాడు.
కొత్త నంబర్ నుంచి చేయడంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటే ఫోన్ కట్ చేస్తున్నావని అడగడంతో నువ్వా.. మనుషులు పెట్టి కొట్టించినా నువ్వు మారలేదా అని రోహిణి నోరు జారుతుంది. అంటే నువ్వే ఆ పని చేశావా.. నా సందేహం నిజమైంది.. నీకు మీ అత్తారింట్లో ఇదే చివరి దీపావళి అవుతుంది.. వెంటనే నాకు రూ.లక్ష ఇవ్వు అని డిమాండ్ చేస్తాడు.
{{/usCountry}}కొత్త నంబర్ నుంచి చేయడంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటే ఫోన్ కట్ చేస్తున్నావని అడగడంతో నువ్వా.. మనుషులు పెట్టి కొట్టించినా నువ్వు మారలేదా అని రోహిణి నోరు జారుతుంది. అంటే నువ్వే ఆ పని చేశావా.. నా సందేహం నిజమైంది.. నీకు మీ అత్తారింట్లో ఇదే చివరి దీపావళి అవుతుంది.. వెంటనే నాకు రూ.లక్ష ఇవ్వు అని డిమాండ్ చేస్తాడు.
{{/usCountry}}దీంతో రోహిణి వణికిపోతూ విద్య ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఇంటి బయటకు రాగానే దినేష్ మనిషి అక్కడ ఉంటాడు. రోహిణి ఫొటో తీసి దినేష్ కు పంపిస్తాడు. ఆమెనే రోహిణి.. ఆమె ఎక్కడికి వెళ్లిన ఫాలో అవ్వు.. ఏం చేసినా నాకు చెప్పు అని అంటాడు. ఆ తర్వాత రోహిణి.. విద్య ఇంటికి వెళ్తుంది.
శృతికి తల్లి శోభ ఫోన్.. గొడవకు ప్లాన్
మరోవైపు శృతికి తల్లి శోభ ఫోన్ చేస్తుంది. పండుగకు వస్తున్నారా అని అడుగుతంది. ఈసారి ఇక్కడే పండుగ జరుపుకుంటాం.. అయినా అక్కడికి వస్తే నేను ఒక్కదాన్నే క్రాకర్స్ కాల్చుకోవాలి.. ఇక్కడైతే అందరం ఉంటాం.. అయినా ఇప్పుడే గొడవ సద్దుమణిగి అందరం పండుగ కోసం సిద్ధమవుతున్నాం అని శృతి అంటుంది. మళ్లీ ఏం గొడవ అనగానే రూమ్ కోసం జరిగిన గొడవ గురించి చెబుతుంది. అది విని ఆ ఇంట్లో మరో గొడవ పెట్టడానికి తనకు ఛాన్స్ దొరికిందని శోభ అనుకుంటుంది.
రోహిణికి బదులు మీనా కిడ్నాప్
అటు విద్య ఇంటికి రోహిణి వెళ్తుంది. ఆ విషయం దినేష్ కు ఫోన్ చేసి చెబుతాడు అతని మనిషి. అక్కడే ఉండమని, ఆమె బయటకు రాగానే కిడ్నాప్ చేసి తీసుకురావాలని చెప్పి మరింత మందిని పంపిస్తాడు. దినేష్ ఫోన్ గురించి విద్యకు చెప్పి రోహిణి బాధపడుతుంది. లక్ష ఇవ్వాల్సిందే అని విద్యకు చెబుతుండగా మీనా అక్కడికి వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అనగానే.. డెకరేషన్ కోసం తానే పిలిచానని విద్య కవర్ చేస్తుంది.
రోహిణి బయటకు రాగానే కిడ్నాప్ చేసి బండిలోకి ఎక్కించండి అని చెప్పి ఆ వ్యక్తి మిగిలిన వారికి చెబుతాడు. ఆమె ఎర్ర చీర కట్టుకుందని అంటాడు. అప్పుడే మీనా బయటకు వస్తుంది. బాలుతో ఫోన్ లో మాట్లాడుతుండగా ఆమెనే రోహిణి అనుకొని ముగ్గరు వచ్చి ఆమెను బలవంతంగా బండిలోకి ఎక్కించుకొని తీసుకెళ్తారు.
ఉగ్రరూపం చూపించిన మీనా
అటు మీనాను వెతుక్కుంటూ బాలు విద్య ఇంటికి వస్తాడు. ఆమె అప్పుడే వెళ్లిపోయింది కదా అని విద్య చెబుతుంది. తర్వాత బయటకు వచ్చి ఫోన్ చేస్తే.. ఫోన్ అక్కడ పడి ఉండటం చూసి బాలు షాక్ తింటాడు. అటు నీ భర్త తనకు బాకీ ఉన్నాడంటూ మీనాను కట్టి పడేస్తాడు దినేష్. అప్పుడే బాలు అక్కడికి వచ్చి దినేష్ ను నిలదీస్తాడు. కొడతాడు.
అతని పక్కనున్న మనుషులు బాలు తలపై గట్టిగా కొట్టడం అతడు స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసి మీనా ఉగ్రరూపం చూపిస్తుంది. దినేష్ తోపాటు అడ్డొచ్చిన అందరినీ చితకబాదుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.