OTT Trailer: ఓటీటీ యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా మరో వెబ్ సిరీస్ తో ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ రెడీ అయింది. ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను స్కూల్ డేస్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిన ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
హెడ్ మాస్టర్ కూతురినే

గుర్తుకొస్తున్నాయి సిరీస్ ట్రైలర్ స్టార్టింగ్ లో.. తను చదివిన స్కూల్ హెడ్ మాస్టర్ కూతురిని ప్రేమిస్తాడు హీరో సంతోష్. స్కూల్లో హీరో వెధవ వేషాలు చూసిన ఆ హెడ్ మాస్టర్ తన కూతురి ప్రేమకు ఒప్పుకోడు. కానీ సంతోష్ మారిపోయాడని తన తండ్రిని ఆ అమ్మాయి ఒప్పిస్తుంది. కానీ ఇంకా ఒక్క తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టనని ఆ హెడ్ మాస్టర్ చెప్తాడు.
ఆ యాక్సిడెంట్ తో
ఫ్రెండ్స్ తో కలిసి సంతోష్ కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో అతను గతం మర్చిపోతాడు. తిరిగి గతం గుర్తుకు రావాలంటే గతంలో జరిగిన బలమైన సంఘటనలు వివరించాల్సి ఉంటుంది. చివరకు అమ్మానాన్నలను కూడా మర్చిపోయిన సంతోష్ చేసే హడావుడి ఫన్నీగా ఉంటుంది.
స్కూల్ డేస్
సంతోష్ కు గతం గుర్తు చేయాలని ఫ్రెండ్స్ డిసైడ్ అవుతారు. తన స్కూల్ డేస్ లవ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ తో లవ్, ఫ్రెండ్స్ తో అతను చేసిన అల్లరి ఎంతో సరదాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. చివరకు ఫ్రెండ్స్, ప్రేమించిన అమ్మాయి కూడా సంతోష్ ను చీ కొడతారు. మరి చివరకు ఏమైంది? సంతోష్ కు గతం గుర్తుకు వచ్చిందా? అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
గతం మర్చిపోవడం అనేది ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన పాయింట్. అయితే ఇక్కడ స్కూల్ డేస్, లవ్ స్టోరీని కథకు కనెక్ట్ చేయడం బాగుందని చెప్పొచ్చు. ఈ గుర్తుకొస్తున్నాయి సిరీస్ కు ఇదే బలం. పాఠశాల రోజుల్లోని అల్లరి, ప్రేమను చూసే ఆడియన్స్ కు గుర్తు చేసేలా ఈ సిరీస్ ఉండనుంది. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి, ఫ్రెండ్స్, తల్లిదండ్రులు.. ఇలా ఎమోషనల్ గానూ ఈ సిరీస్ టచ్ చేసేలా కనిపిస్తోంది.
{{/usCountry}}గతం మర్చిపోవడం అనేది ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన పాయింట్. అయితే ఇక్కడ స్కూల్ డేస్, లవ్ స్టోరీని కథకు కనెక్ట్ చేయడం బాగుందని చెప్పొచ్చు. ఈ గుర్తుకొస్తున్నాయి సిరీస్ కు ఇదే బలం. పాఠశాల రోజుల్లోని అల్లరి, ప్రేమను చూసే ఆడియన్స్ కు గుర్తు చేసేలా ఈ సిరీస్ ఉండనుంది. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి, ఫ్రెండ్స్, తల్లిదండ్రులు.. ఇలా ఎమోషనల్ గానూ ఈ సిరీస్ టచ్ చేసేలా కనిపిస్తోంది.
{{/usCountry}}స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ జులై 3 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫస్ట్ ఎపిసోడ్ ను ఫ్రీగా చూసే ఆఫర్ కల్పిస్తున్నారు. బేబీ మూవీతో పాపులర్ అయిన విరాజ్ ఈ సిరీస్ లో హీరో. అతనితో పాటు ఈ ఓటీటీ సిరీస్ లో ముంబయి భామ యశశ్రీ రావు, రోహిణి, శివ నారాయణ, ప్రియదర్శిని రామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సిరీస్ కు వినోద్ గాలి డైరెక్టర్.
90స్, అనగనగా లాంటి స్పెషల్ రిలీజ్ లతో ఆడియన్స్ ను గతంలోకి తీసుకెళ్లిన ఈటీవీ విన్.. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయితో మరోసారి అలాంటి ఫీల్ అందించేందుకు రెడీ అవుతోంది.