నెల రోజులుగా క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన టీ20 ప్రపంచకప్ 2026 ఎండింగ్ కు వచ్చేసింది. రేపే (మార్చి 8) గ్రాండ్ ఫైనల్. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టైటిల్ పోరులో న్యూజిలాండ్ ను ఇండియా ఢీ కొడుతుంది. అయితే ఈ ఫైనల్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది.
టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ

మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే టీ20 ప్రపంచకప్ క్లోజింగ సెర్మనీకి గ్లోబల్ లెవల్ టచ్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈ ఈవెంట్ లో గ్లోబల్ పాప్ స్టార్, గ్రామీ అవార్డు విన్నర్ రికీ మార్టిన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. తన సాంగ్స్ తో అతను స్టేడియాన్ని ఊపేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇండియన్ సెలబ్రిటీలు
టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీలో రికీ మార్టిన్ తో పాటు ఇండియన్ సెలబ్రిటీలు కూడా ప్రదర్శన ఇవ్వబోతున్నారు. దాండియా క్వీన్ గా పేరొందిన ఫాల్గుణి పాఠక్, సుఖ్బీర్ తమ సాంగ్స్ తో నరేంద్ర మోదీ స్టేడియాన్ని షేక్ చేయబోతున్నారు.
గ్రాండ్ ఈవెంట్
‘‘ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ కు ముందు జరిగే సెర్మనీలో గ్లోబల్ సూపర్ స్టార్ రికీ మార్టిన్తో పాటు సంగీత దిగ్గజాలు సుఖ్బీర్, ఫాల్గుణి పాఠక్ కూడా పర్ఫార్మ్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్త హిట్లు, దేశీ గీతాల కోసం రెడీగా ఉండండి’’ అని ఐసీసీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
క్లోజింగ్ సెర్మనీ
టీ20 ప్రపంచకప్ 2026 క్లోజింగ్ సెర్మనీని ఐసీసీ భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఇంటర్నేషనల్ స్టార్ రికీ మార్టిన్ తో పాటు ఇండియన్ సెలబ్రిటీ సింగర్లు ఫాల్గుణి పాఠక్, సుఖ్బీర్ ను స్టేజీ పైకి వదలబోతుంది. ఈ క్లోజింగ్ సెర్మనీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ట్ కానుంది.
మ్యాచ్ టైమ్, స్ట్రీమింగ్
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా ఢీ కొడుతుంది. ఈ టైటిల్ పోరు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేస్తారు. ఈ ఫైనల్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియోహాట్ స్టార్ లో లైవ్ చూడొచ్చు.
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా ఢీ కొడుతుంది. ఈ టైటిల్ పోరు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేస్తారు. ఈ ఫైనల్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియోహాట్ స్టార్ లో లైవ్ చూడొచ్చు.
{{/usCountry}}అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ను లక్ష మంది ఆడియన్స్ డైరెక్ట్ గా చూడబోతున్నారు. ఈ పోరులో ఇండియా గెలవాలన్నదే అందరి కోరిక.