...
...
Next Story

టెన్షన్.. టెన్షన్.. చెన్నైలో సెలబ్రిటీలకు బాంబు బెదిరింపులు.. త్రిష, విజయ్ తర్వాత ఇప్పుడు ఇళయరాజాకు ఫేక్ ఈమెయిల్

ఇటీవల చెన్నైలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని కొందరు బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Oct 15, 2025, 13:15:04 IST
Advertisement

గత కొంతకాలంగా తమిళనాడులోని చెన్నైలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపులతో అక్కడ పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. ఇవి భద్రతాపరమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కూడా ఇలాంటి బాంబు బెదిరింపును ఎదుర్కొన్నారు. ది హిందూ నివేదిక ప్రకారం, మంగళవారం రోజున టి. నగర్‌లోని ఆయన స్టూడియోకి బాంబు బెదిరింపు వచ్చింది.

అసలేం జరిగిందంటే..

ఇళయరాజా
ఇళయరాజా

ఇళయరాజా స్టూడియోకి బాంబు బెదిరింపు వచ్చింది. ది హిందూ రిపోర్ట్ ప్రకారం మంగళవారం (అక్టోబర్ 14) ఇళయరాజా స్టూడియోలో బాంబు పెట్టామని ఆయనకు, డీజీపీ కార్యాలయానికి ఒక ఈమెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS)తో సహా పోలీసులు సంగీత దర్శకుడు ఇళయరాజా స్టూడియోకి చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆ బెదిరింపు నకిలీదని పోలీసులు నిర్ధారించారు.

ఆ మెయిల్ లాగే

చివరకు బాంబు బెదిరింపు ఉత్తిదే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హాట్‌మెయిల్ అడ్రస్ నుంచి పంపిన ఈ ఈమెయిల్, గత కొన్ని వారాలుగా చెన్నైలోని ఇతర వీఐపీలకు పంపిన ఈమెయిళ్ల మాదిరిగానే ఉందని విచారణలో తేలింది. ఈ విషయంపై సైబర్ క్రైమ్, సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నకిలీ బాంబు బెదిరింపులను పోలీస్ డిపార్ట్ మెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది.

త్రిష, విజయ్‌లకు కూడా

అక్టోబర్ 2న తేనాంపేటలోని నటి త్రిష, మాండవేలిలోని శేఖర్‌తో సహా పలువురు వీఐపీల కార్యాలయాలు, నివాసాల్లో బాంబులు పెట్టామని డీజీపీకి ఈమెయిల్స్ వచ్చాయి. BDDS బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు చేయగా, అనుమానాస్పదంగా ఏమీ కనపడలేదు. మరోవైపు పీటీఐ నివేదిక ప్రకారం, అక్టోబర్ 9న నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ నివాసంలో బాంబు పెట్టానని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది.

అరెస్ట్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe