Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ప్రేమకు ప్రేమగా అన్నం తినిపిస్తాడు ధీరజ్. ప్రేమ మురిసిపోతుంది. కష్టాల్లో నిన్ను మీ ఇంటికి పంపించామని మీవాళ్లు కాకుల్లా కేకలు పెడతారని చూసుకుంటా అని చెప్పా. దానికి మురిసిపోకు అని ధీరజ్ అంటాడు. అలాగే, అంటాడు కానీ నీపై ధీరజ్కు చాలా ప్రేమ ఉందని నర్మద చెబుతుంది.
ప్రేమకోసం అంతలా ఏడ్చావ్

అదేం లేదు అని ధీరజ్ అంటే.. మరి హాస్పిటల్లో ప్రేమకోసం ఎందుకు అంతలా ఏడ్చావ్ అని నర్మద మరిది ధీరజ్ను ఇరికిస్తుంది. నీకు ఏమవుతుందో అని అందరిలానే ఏడ్చా, అంతకుమించి ఏం లేదని ధీరజ్ అంటాడు. అదే మగాడు చూపించే నిజమైన ప్రేమ అని నర్మద అంటుంది. తర్వాత యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ అది యాక్సిడెంట్లా అనిపించట్లేదు అక్కా. ఎవరో కావాలనే చేశారనిపిస్తుందని ప్రేమ డౌట్ పడుతుంది.
మరోవైపు క్యారెజ్ వంకతో అత్తారింట్లో పాతుకుపోతా అని శ్రీవల్లి సంతోషంగా గెంతుతూ వస్తుంది. మావయ్యను మాయ సేత్తే అయిపోతుందని శ్రీవల్లి అనుకుంటుంది. బ్రేకులు ఫెయిల్ అయితే డ్రైవర్ వేరే వైపుకు తిప్పొచ్చు. చందు బావ ఉన్నవైపే ఎందుకు వస్తుందని, పైగా చందు బావ పక్కకే ఉన్నారని ప్రేమ అంటుంది. అన్యయ్యను కావాలనే యాక్సిడెంట్ చేయాలని చూశారని అంటున్నావా అని ధీరజ్ అంటాడు.
అప్పుడే వచ్చి విన్న శ్రీవల్లి ఏంటీ తెలిసిపోయిందా అని షాక్ అయి క్యారేజ్ కింద పడేస్తుంది. ఇంతలో అందరూ వచ్చేస్తారు. ఏంటీ తెలిసిపోయిందా అంటున్నావ్ అని నర్మద అంటే.. యాక్సిడెంట్ గురించి తెలిసిందని కవర్ చేస్తుంది వల్లి. చందుపై ప్రేమ ఒలకబోస్తుంది. డ్రామా ఆపమని చందు అంటాడు. తర్వాత ప్రేమపై కూడా బాగా ప్రేమ ఒలకబోస్తుంది. తల్లిలా దగ్గరుండి ప్రేమను చూసుకంటాను అంటుంది.
శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్
ఇక చాలు నువ్వెళ్లు అని చందు అంటాడు. వల్లి వెళ్లనంటుంది. వెళ్లను అంటే వెళ్లమంటావేంట్రా అని రామరాజు అంటాడు. తను ఇక్కడ ఉండే వాళ్ల అమ్మను ఎవరు చూసుకుంటారు అని చందు అంటాడు. అది కరెక్టే కదా. మీ అమ్మకు ఎలా ఉందని రామరాజు అడిగితే.. తనకేమైంది గుండ్రాయిలా ఉందని శ్రీవల్లి నోరు జారుతుంది. దాంతో అంతా షాక్ అయి చూస్తారు. మీ అమ్మ కాలు విరిగింది కదా. అలా అంటావేంటీ అని రామరాజు నిలదీస్తాడు.
{{/usCountry}}ఇక చాలు నువ్వెళ్లు అని చందు అంటాడు. వల్లి వెళ్లనంటుంది. వెళ్లను అంటే వెళ్లమంటావేంట్రా అని రామరాజు అంటాడు. తను ఇక్కడ ఉండే వాళ్ల అమ్మను ఎవరు చూసుకుంటారు అని చందు అంటాడు. అది కరెక్టే కదా. మీ అమ్మకు ఎలా ఉందని రామరాజు అడిగితే.. తనకేమైంది గుండ్రాయిలా ఉందని శ్రీవల్లి నోరు జారుతుంది. దాంతో అంతా షాక్ అయి చూస్తారు. మీ అమ్మ కాలు విరిగింది కదా. అలా అంటావేంటీ అని రామరాజు నిలదీస్తాడు.
{{/usCountry}}దెబ్బ తగిలింది కాలుకు కదా. మనిషి మాత్రం గుండ్రాయిలా ఉందన్నాను అని శ్రీవల్లి కవర్ చేస్తుంది. నాకంటే ఎక్కువగా మీ అమ్మను చూసుకోవడం ఇంపార్టెంట్ అని ప్రేమ అంటుంది. తను ఎలాగైనా చూసుకుంటుంది. ఇక్కడే ఉంటాను అని మారం చేస్తుంది శ్రీవల్లి. నర్మదా కూడా తల్లిని చూసుకోవాలి కదా అని అంటుంది. అయినా వల్లి వినదు. చందు కూడా వెళ్లమని తిడతాడు. రామరాజు కూడా వెళ్లమని అంటాడు.
రాత్రి అయింది కాబట్టి చందును దిగబెట్టి రమ్మని రామరాజు చెబుతాడు. దాంతో తను వచ్చిన ప్లాన్ ఫెయిల్ అయిందని శ్రీవల్లి అనుకుంటుంది. ఈ నర్మద ఇక్కడ ఉండగా నీ ఆటలు, మీ అమ్మ కుట్రలు సాగవని చెప్పు అని పంచ్లు వేస్తుంది. ప్రేమ కూడా కౌంటర్ ఇస్తుంది. శ్రీవల్లి ఇద్దరిని చూస్తూ కోపంగా వెళ్లిపోతుంది. మరోవైపు చేపల ముక్కలు వేయమని, అందుకోసమే చూస్తున్నా ఆరాటంగా అంటాడు భాగ్యం భర్త.
తిరిగి తన్నిన బ్రహ్మాస్త్రం
ముక్కలు లేవని, మొత్తం వల్లితో పంపించినట్లు చెబుతుంది భాగ్యం. ఇంతలో వల్లి వచ్చి చేపల కూర క్యారేజ్ కోపంగా కింద పడేస్తుంది. అక్కడ జరిగింది అంతా చెబుతుంది. ఇదేంటీ అమ్మడు తిరుగులేని బ్రహ్మాస్త్రం వస్తే ఇలా తిరిగి తన్నింది అని భాగ్యం షాక్ అవుతుంది. ప్రేమ, నర్మదలు పులి పిల్లల్లా నా మీద ఎగిరిపడుతున్నారు. నువ్వు వాళ్లతో ఛాలెంజింగ్లు చేయడం వల్లే, అత్తారింట్లో నేను పడటం కష్టమనిపిస్తోంది అని శ్రీవల్లి అంటుంది.
మరుసటి రోజు ఉదయం లారీ నెంబర్ ఫ్రెండ్కు పంపి డీటేల్స్ కావాలని అడుగుతాడు. అలా ఎంక్వైరీ చేయిస్తున్న ధీరజ్ను గట్టిగా అరుస్తూ పిలుస్తుంది ప్రేమ. పక్కన ఉన్న ప్లేట్ ఇవ్వమని అడుగుతుంది. కాసేపు వాదించుకున్నాకా ధీరజే ప్లేట్ ఇస్తాడు. నాకు చేయి నొప్పి తినలేనురా, యాక్సిడెంట్లో భుజం పట్టేసింది అని ప్రేమ అంటుంది.
నొప్పి ఉన్నట్లు డ్రామాలు ఆడుతుంది ప్రేమ. దాంతో ప్రేమకు ధీరజ్ టిఫిన్ తినిపిస్తాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.