త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో సాహితీ అవంచ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇట్లు మీ ఎదవ ట్రైలర్ లాంచ్

ఇటీవల రిలీజ్ చేసిన ఇట్లు మీ ఎదవ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ (అక్టోబర్ 31) ఇట్లు మీ ఎదవ మూవీ ట్రైలర్ను మేకర్స్ లాంచ్ చేశారు.
ఫీల్ గుడ్ ఎలిమెంట్స్తో ట్రైలర్
యూత్ఫుల్ ఫన్, బ్యూటిఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో, డైరెక్టర్ త్రినాధ్ కటారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వారికి పాదాభివందనం
హీరో, దర్శకుడు త్రినాధ్ కటారి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మీడియా వారికి పాదాభివందనం. ప్రేక్షకులకు నమస్కారం. మేము ఒక మంచి సినిమా చేసాం. అందరూ కష్టపడ్డారు. నేను కష్టపడ్డాను. అందరు కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. భరణి గారు, గోపరాజు రమణ గారు దేవి ప్రసాద్ గారు వారిచ్చిన సపోర్టు ఎప్పటికీ మర్చిపోలేను" అని అన్నారు.
కొత్త వాడినని చూడలేదు
"ఎవరు కూడా నేను కొత్త వాడినని చూడలేదు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలానే నన్ను చూసుకున్నారు. డీవోపీ జగదీష్ గారు సినిమాని అద్భుతంగా చూపించారు. ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రి కొడుకులు కథ, తండ్రి కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ" అని త్రినాధ్ కటారి తెలిపారు.
కథ చెప్తున్నప్పుడే
"నిర్మాత బళ్లారి శంకర్ గారు చాలా మంచి వ్యక్తి. పట్నాయక్ గారికి ఈ కథ చెప్తున్నప్పుడే ఒక హిట్ సినిమాకి పనిచేయబోతున్నాం అని చెప్పారు. అది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో అందరూ మంచి పాత్రలు చేశాం. 100% మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాం" అని హీరో, డైరెక్టర్ త్రినాధ్ కటారి పేర్కొన్నారు.
చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఇది
{{/usCountry}}"నిర్మాత బళ్లారి శంకర్ గారు చాలా మంచి వ్యక్తి. పట్నాయక్ గారికి ఈ కథ చెప్తున్నప్పుడే ఒక హిట్ సినిమాకి పనిచేయబోతున్నాం అని చెప్పారు. అది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో అందరూ మంచి పాత్రలు చేశాం. 100% మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాం" అని హీరో, డైరెక్టర్ త్రినాధ్ కటారి పేర్కొన్నారు.
చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఇది
{{/usCountry}}హీరోయిన్ సాహితీ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. మా టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఇది. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. అందరూ కనెక్ట్ అయ్యే సినిమా" అని అన్నారు.
నమ్మకంతో పని చేశారు
"మా డైరెక్టర్ గారు చాలా క్లియర్ విజన్తో చేశారు. ఆయన వల్లే ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ చేయగలిగాం. మా నిర్మాత శంకర్ గారు చాలా మంచి పర్సన్. మా మీద నమ్మకంతో సినిమా చేశారు. తప్పకుండా ఆయనకి చాలా మంచి విజయం దొరుకుతుందని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది" అని సాహితీ అవంచ పేర్కొంది.