షాకింగ్.. ఈ నటుడేంటి ఇలా అయిపోయాడు.. రామ్ చరణ్ పెద్ది నుంచి అప్పలసూరి లుక్ రిలీజ్.. ఎవరో గుర్తు పట్టారా?
రామ్ చరణ్ పెద్ది నుంచి మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. అయితే ఇందులో ఆ నటుడిని చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అసలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన అతన్ని చూసి ఎవరా అని అనుకున్నారు. మీరు గుర్తు పట్టగలరేమో చూడండి.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ నుంచి అప్పలసూరి అనే పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ చూడగానే ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఇందులో ఉన్నది జగపతి బాబు అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు.

పెద్దిలో అప్పలసూరిగా జగపతి బాబు
పైనున్న ఫొటో చూశారు కదా? అది జగపతి బాబు అంటే నమ్మగలరా? పెద్ది సినిమాలో అప్పలసూరి అనే పాత్ర కోసం ఈ స్టార్ నటుడు పూర్తిగా మారిపోయాడు. ఈ మధ్య తనకు అనువైన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జగపతి బాబు.. పెద్దిలో మాత్రం ఇలా పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.
“పెద్దిలో అప్పలసూరిగా అద్భుతమైన జగపతి బాబు. ఓ బలమైన, ప్రభావవంతమైన పాత్రలో అతని మాస్టర్క్లాస్ పర్ఫార్మెన్స్ చూడటానికి సిద్ధంగా ఉండండి. పెద్ది మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది” అనే క్యాప్షన్ తో పెద్ది అధికారిక ఎక్స్ అకౌంట్ ట్వీట్ చేసింది.
అటు రామ్ చరణ్ కూడా ఈ పోస్టర్ ను తన అకౌంట్లో షేర్ చేశాడు. “స్క్రీన్ కు అతడు తీసుకొచ్చే ఇంటెన్సిటీ మరెవరి వల్లా సాధ్యం కాదు. జగపతి బాబు గారిని పెద్దిలో అప్పలసూరిగా చూడటం చాలా సంతోషంగా ఉంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేశాడు.
పెద్ది మూవీ గురించి..
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మూవీ పెద్ది. నేషనల్ అవార్డు విన్నర్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన చికిరి చికిరి పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.
మ్యూజిక్ తోపాటు చరణ్ స్టెప్పులు బాగా ఆకర్షించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా.. టీమ్ మాత్రం పదే పదే రిలీజ్ డేట్ అంటూ స్పష్టత ఇస్తూనే ఉంది. తాజాగా జగపతి బాబు లుక్ రిలీజ్ చేస్తూ కూడా మరోసారి డేట్ కన్ఫమ్ చేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


