...
...
Next Story

Jagapathi Babu: లిటిల్ హార్ట్స్ ఓ నాన్సెన్స్ సినిమా అంటూ జగపతి బాబు కామెంట్స్.. అసలు ఎందుకిలా అన్నాడో తెలుసా?

Jagapathi Babu: 2025లో టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన 'లిటిల్ హార్ట్స్' చిత్రంపై సీనియర్ నటుడు జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం 'పెద్ది' ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ సినిమాను ఒక 'నాన్‌సెన్స్' అని పిలవడం గమనార్హం.

Published on: Jun 2, 2026, 15:17:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jagapathi Babu: టాలీవుడ్‌లో గతేడాది వచ్చిన అతిపెద్ద సక్సెస్ స్టోరీస్‌లో 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) సినిమా ఒకటి. యూత్ స్టార్స్ మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నాగరామ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాతో.. సీనియర్ మేకర్ బి.వి.ప్రసాద్ మనవడు సాయి మార్తాండ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకున్న ఈ క్లీన్ ఎంటర్‌టైనర్‌పై తాజాగా సీనియర్ నటుడు జగపతి బాబు కొన్ని బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Jagapathi Babu Comments on Little Hearts | ఆ సినిమా ఒక 'నాన్‌సెన్స్'..

Jagapathi Babu: లిటిల్ హార్ట్స్ ఓ నాన్సెన్స్ సినిమా అంటూ జగపతి బాబు కామెంట్స్.. అసలు ఎందుకిలా అన్నాడో తెలుసా?
Jagapathi Babu: లిటిల్ హార్ట్స్ ఓ నాన్సెన్స్ సినిమా అంటూ జగపతి బాబు కామెంట్స్.. అసలు ఎందుకిలా అన్నాడో తెలుసా?

తాజాగా తన 'పెద్ది' (Peddi) మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న జగపతి బాబు.. 'లిటిల్ హార్ట్స్' సినిమా గురించి మాట్లాడుతూ దాన్ని ఒక "నాన్‌సెన్స్ సినిమా" అని అభివర్ణించారు. అయితే ఆయన ఈ మాటను నెగెటివ్‌గా అనలేదు. మన కమర్షియల్ సినిమాల రెగ్యులర్ ఫార్ములాలకు భిన్నంగా ఆ సినిమా సాగిందనే అర్థంలో సరదాగా వాడారు.

"లిటిల్ హార్ట్స్ కథ, క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా మార్చమని నేను సాయి మార్తాండ్‌కు అప్పట్లోనే సలహా ఇచ్చాను. కానీ రెగ్యులర్ ఫార్ములాలను బ్రేక్ చేసి, ఒక సరికొత్త ఫ్రెష్‌నెస్‌తో, అమాయకత్వంతో ఈ సినిమాను తెరకెక్కించిన సాయి కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ చిత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయి, అంత పెద్ద హిట్ అయింది" అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఈ సినిమాలో రాజీవ్ కనకాల చేసిన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ సాయి మొదట తననే అడిగాడనే ఆసక్తికర విషయాన్ని కూడా జగ్గూభాయ్ బయటపెట్టారు.

అడివి శేష్‌తో నెక్స్ట్ ప్రాజెక్ట్.. ప్రొడ్యూసర్‌గా జగపతి బాబు

ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే ప్రశ్నకు జగపతి బాబు ఆన్సర్ ఇస్తూ.. ఆ నిర్ణయం పూర్తిగా డైరెక్టర్ సాయి మార్తాండ్, కో-ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ చేతుల్లోనే ఉందని, కరెక్ట్ టైమ్ లో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

హెచ్‌టీ విశ్లేషణ

కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. జగపతిబాబు లాంటి సీనియర్ నటుడు ఒక డెబ్యూ డైరెక్టర్ టాలెంట్ ను నమ్మి డబ్బులు పెట్టడం చాలా పాజిటివ్ విషయం. అడివి శేష్ ఎప్పుడూ థ్రిల్లర్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉన్న కథలనే ఎంచుకుంటాడు.

ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లాంటి ఫీల్ గుడ్ మూవీ తీసిన డైరెక్టర్ తో శేష్ చేతులు కలపడం అంటే కచ్చితంగా ఇది ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అవ్వడం ఖాయం.

People Also Ask (FAQs)

'లిటిల్ హార్ట్స్' సినిమా డైరెక్టర్ ఎవరు, ఇందులో హీరో హీరోయిన్లు ఎవరు?

ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా.. మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నాగరామ్ హీరో హీరోయిన్లుగా నటించారు.

జగపతి బాబు 'లిటిల్ హార్ట్స్' సినిమాను ఎందుకు 'నాన్‌సెన్స్ సినిమా' అన్నారు?

ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా, చాలా వినూత్నమైన కథనం, క్లైమాక్స్‌తో సాగిందనే ఉద్దేశంతో ఆయన ఆ పదాన్ని నెగెటివ్ గా కాకుండా, చాలా పాజిటివ్ గా, సరదాగా వాడారు.

దర్శకుడు సాయి మార్తాండ్ నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండబోతోంది? దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు?

సాయి మార్తాండ్ తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ హీరో అడివి శేష్‌తో చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సీనియర్ నటుడు జగపతి బాబు, ఏషియన్ సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe