Jagapathi Babu: విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ, విలక్షణమైన నటనతో జగపతి బాబు అదరగొడుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోలా దూసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు విలన్ సహా ఇతర క్యారెక్టర్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా జగపతి బాబు సోషల్ మీడియా పోస్టు వైరల్ గా మారింది. ఒక్కడు.. అంటూ ఆయన ఫొటో పంచుకున్నారు.
ఒక్కడు అంటూ జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచే జగ్గూ భాయ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏదో మెట్రో స్టేషన్ లో జగపతి ఆ ఫోటో తీసుకున్నట్లు ఉంది.
‘‘ఒక్కడు.. నేను ఒక్కడినే ట్రైన్ ఎక్కి హోటల్ కు వెళ్లిపోతున్నాను. ఎక్కడికి వెళ్తానే ఏమిటో.. అసలే దారి తెలియదు’’ అని జగపతి బాబు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.
వైరల్ పోస్టు
జగపతి బాబు పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో సరదాగా రియాక్టవుతున్నారు. ‘ట్రైన్ కి దారి తెలుసులేండీ’, ‘చిల్ అవడానికి వెళ్తున్నారు బాబాయ్’, ‘సర్, కొంచెం స్మైల్ ఇవ్వొచ్చు కదా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పెద్ది సినిమాలో
{{/usCountry}}జగపతి బాబు పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో సరదాగా రియాక్టవుతున్నారు. ‘ట్రైన్ కి దారి తెలుసులేండీ’, ‘చిల్ అవడానికి వెళ్తున్నారు బాబాయ్’, ‘సర్, కొంచెం స్మైల్ ఇవ్వొచ్చు కదా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పెద్ది సినిమాలో
{{/usCountry}}రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ మూవీలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘అప్పలసూరి’ అనే క్యారెక్టర్ కోసం గుర్తు పట్టలేనంతగా తన లుక్ ను ఆయన మార్చుకున్నారు. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఫ్యామిలీ హీరో నుంచి
‘సింహ స్వప్నం’ మూవీతో హీరోగా డెబ్యూ చేసిన జగపతి బాబు ఆ తర్వాత ఫ్యామిలీ హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు. 2013లో ఆపరేషన్ దుర్యోధన 2లో హీరోగా నటించారు. ఆ తర్వాత ఆయన కెరీర్ మలుపు తీసుకుంది.
సెకండ్ ఇన్నింగ్స్
2014లో వచ్చిన లెజెండ్ తో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో క్రూరమైన విలన్ గా జగపతి బాబు తన యాక్టింగ్ తో ఇరగదీశారు. ఫ్యామిలీ హీరోలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అని ఆ మూవీలో జగ్గూ భాయ్ ను చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి విలన్, కీలక క్యారెక్టర్లు చేస్తూ జగపతి బాబు దూసుకెళ్తున్నారు.
తాజాగా వదలా అనే థ్రిల్లర్ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. లయ, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజైంది. భార్యభర్తల మధ్య మూడో మనిషి వస్తే ఎలాంటి ఇబ్బందులు వచ్చాయనే కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది.