Jana Nayagan: కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' ఆన్లైన్లో లీక్ అవ్వడం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. సినిమా రిలీజ్కు ముందే పైరసీ బారిన పడినప్పటికీ, ఆడియన్స్ ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను థియేటర్లలోనే చూడాలని డైరెక్టర్ హెచ్ వినోద్ కోరడం విశేషం. పెద్ద స్క్రీన్ పైనే ఈ కథలోని అంశాలను చూసి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇది కేవలం ప్రమోషన్ కాదు

జన నాయగన్ సినిమా లీక్ అవడం థియేట్రికల్ కలెక్షన్లపై కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది అనధికారిక లీకైన కాపీలు చూసేసినట్లు విన్నానని, దీంతో థియేటర్లలో ఈ సినిమాను చూస్తారో చూడరో అని అన్నారు. అయినా సరే విజయ్ సార్ కోసం ఫ్యాన్స్ థియేటర్లకు వస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు.
ఈ మూవీ కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే సాధారణ సినిమా కాదని, ఇందులో ఎన్నో సెన్సిటివ్ పొలిటికల్ ఇష్యూస్ టచ్ చేశామని క్లారిటీ ఇచ్చారు. విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీని కేవలం ప్రమోట్ చేయడానికే ఈ సినిమా తీయలేదని, సమాజానికి అవసరమైన ఒక బలమైన సందేశం ఇందులో ఉందని స్పష్టం చేశారు.
సీఎం అవుతారని ఊహించలేదు.. అంతా ఒక కలలా ఉంది!
ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి రోజులను డైరెక్టర్ హెచ్ వినోద్ గుర్తుచేసుకున్నారు. షూటింగ్ టైంలో విజయ్ సీఎం అవుతారని తాము అస్సలు అనుకోలేదని, ఇప్పుడు అంతా ఒక కలలా అనిపిస్తోందని చెప్పారు.
ఆ ఎలక్షన్ ఫలితాల్లో విజయ్ సాధించిన ల్యాండ్మార్క్ విక్టరీని తాము కూడా తక్కువ అంచనా వేశామని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎలక్షన్స్ కు ముందే ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ చేశామని, ఇప్పుడు పొలిటికల్ గా ఎన్నో మార్పులు వచ్చినా మూవీ ఒరిజినల్ కంటెంట్లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించారు.
సెన్సార్ కట్స్ దాటుకుని.. జులై 23న గ్రాండ్ రిలీజ్
{{/usCountry}}ఆ ఎలక్షన్ ఫలితాల్లో విజయ్ సాధించిన ల్యాండ్మార్క్ విక్టరీని తాము కూడా తక్కువ అంచనా వేశామని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎలక్షన్స్ కు ముందే ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ చేశామని, ఇప్పుడు పొలిటికల్ గా ఎన్నో మార్పులు వచ్చినా మూవీ ఒరిజినల్ కంటెంట్లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించారు.
సెన్సార్ కట్స్ దాటుకుని.. జులై 23న గ్రాండ్ రిలీజ్
{{/usCountry}}ఎన్నో నెలల సెన్సార్ ఆలస్యాల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ జులై 23న థియేటర్లలో అడుగుపెడుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్కు 'A' సర్టిఫికెట్ వచ్చింది. హెచ్ వినోద్ గతంలో కార్తీతో 'తీరన్ అధిగారమ్ ఒండ్రు', అజిత్ తో 'వలిమై', 'తునివు' లాంటి ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్బస్టర్స్ అందించిన హిస్టరీ ఉంది. అదే రేంజ్ పవర్ ప్యాక్డ్ సీన్లు ఇందులో కూడా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ మెయిన్ విలన్గా రచ్చ చేయబోతున్నారు. రీసెంట్ సెన్సేషన్ మమితా బైజూతో పాటు ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నరైన్, నాజర్ లాంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ కెరీర్ లోనే ఇది లాస్ట్ మూవీ కావడం, పైగా ఆయన రియల్ లైఫ్ లో సీఎం అయిన తర్వాత థియేటర్లలోకి వస్తుండటంతో లీక్ ఇష్యూ పక్కన పెడితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర ఖాయంగా కనిపిస్తోంది.