అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా సాగుతోంది. అయితే, స్టార్ కిడ్ కావడమనేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, దాని వెనుక ఎంతో ఒత్తిడి, చేదు అనుభవాలు కూడా ఉంటాయని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
స్కూల్ రోజుల్లోనే

ప్రముఖ యూట్యూబర్ రాజ్ షామనీ పాడ్కాస్ట్లో పాల్గొన్న జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితం, టెక్నాలజీ దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. స్కూల్ రోజుల్లో ఎదుర్కొన్న ఒక వింతైన, భయానకమైన పరిస్థితిని ఈ సందర్భంగా వివరించింది.
15 ఏళ్ల వయసులోనే
"నాకు అప్పుడు కేవలం 15 ఏళ్లు. స్కూల్లో ఐటీ క్లాస్ జరుగుతున్న సమయంలో కొందరు అబ్బాయిలు సరదా కోసం పోర్న్ సైట్లు చూస్తుండగా, అందులో నా ఫోటోలు కనిపించాయి.
అప్పట్లో అవి డీప్ఫేక్ అవునో కాదో తెలియదు కానీ, నా ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఆ సైట్లలో పెట్టారు. ఆ వయసులో అది నాకు చాలా వింతగా, ఇబ్బందికరంగా అనిపించింది" అని జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్లు చేసింది.
ఏఐ ఫొటోలు
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టిస్తున్న డీప్ఫేక్ చిత్రాల పట్ల జాన్వీ కపూర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం సోషల్ మీడియా వినియోగదారులే కాకుండా, కొన్ని అధికారిక వార్తా సంస్థలు కూడా ఏఐ సృష్టించిన తన చిత్రాలను అసలైనవిగా భావించి షేర్ చేస్తున్నాయని ఆమె మండిపడింది.
ఆ ప్రమాదం
"నేను ఎప్పుడూ ధరించని బట్టలు, నేను ఎప్పుడూ ఇవ్వని పోజులను ఏఐ సహాయంతో సృష్టించి వైరల్ చేస్తున్నారు. దీనివల్ల నా వర్క్ పై ఎఫెక్ట్ పడుతోంది. రేపు ఏదైనా సినిమాలో ఒక సీన్ చేసేటప్పుడు నాకు సౌకర్యంగా లేదని చెబితే.. 'గతంలో ఇలాంటివి చేశారు కదా' అని నా ఏఐ ఫోటోలను చూపించి అడిగే ప్రమాదం ఉంది. ఇది దర్శకుల మనసులో నాపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది," అని జాన్వీ తన ఆవేదన వ్యక్తం చేసింది.
రష్మిక మందన్న బాటలో..
{{/usCountry}}"నేను ఎప్పుడూ ధరించని బట్టలు, నేను ఎప్పుడూ ఇవ్వని పోజులను ఏఐ సహాయంతో సృష్టించి వైరల్ చేస్తున్నారు. దీనివల్ల నా వర్క్ పై ఎఫెక్ట్ పడుతోంది. రేపు ఏదైనా సినిమాలో ఒక సీన్ చేసేటప్పుడు నాకు సౌకర్యంగా లేదని చెబితే.. 'గతంలో ఇలాంటివి చేశారు కదా' అని నా ఏఐ ఫోటోలను చూపించి అడిగే ప్రమాదం ఉంది. ఇది దర్శకుల మనసులో నాపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది," అని జాన్వీ తన ఆవేదన వ్యక్తం చేసింది.
రష్మిక మందన్న బాటలో..
{{/usCountry}}గతంలో నటి రష్మిక మందన్న కూడా ఇలాంటి డీప్ఫేక్ వీడియో బారిన పడిన సంగతి తెలిసిందే. 2023 నవంబర్లో రష్మిక ముఖాన్ని మరో యువతి శరీరానికి మార్ఫింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా, ఆమె ధైర్యంగా స్పందించి తప్పును ఎత్తిచూపారు.
టెక్నాలజీ దుర్వినియోగం కావడం పట్ల రష్మిక అప్పట్లో తీవ్రంగా హెచ్చరించింది. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అదే బాటలో టెక్నాలజీ వల్ల మహిళలకు ఎదురవుతున్న ముప్పును ప్రపంచానికి చాటిచెప్పింది.