Sreeleela Janhvi Kapoor: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లు ఒకే సినిమాలో స్క్రీన్ పంచుకోబోతుండటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉత్తరాది, దక్షిణాది ఇండస్ట్రీలలో విశేష ప్రజాదరణ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్, శ్రీలీల కలసి ఓ భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
శ్రీలీల, జాన్వీ కలిసి

బాలాజీ మోషన్ పిక్చర్స్, సిఖ్య ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు ఏక్తా కపూర్, ఆస్కార్ విజేత గునీత్ మోంగా కపూర్ ఈ వినూత్న చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిసింది. 'పగ్లైట్', 'గ్యారా గ్యారా' వంటి విభిన్న కాన్సెప్ట్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఉమేష్ బిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
సైకోలాజికల్ క్రైమ్ థ్రిల్లర్
సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు ఉన్న కథలు రొటీన్ ట్రయాంగిల్ ప్రేమకథలుగానే తెరకెక్కుతుంటాయి. కానీ ఈ అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ పూర్తిగా డార్క్ రొమాన్స్, సైకోలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాల కలయికగా సాగనుందని తెలిసింది. ఒకే అబ్బాయిని తీవ్రంగా ప్రేమించే ఇద్దరు అమ్మాయిలు, అతడిని దక్కించుకోవడం కోసం వేసే మైండ్ గేమ్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్తున్నారు.
ఒకరిపై ఒకరికి పగ
ఆ ప్రేమ కాస్తా క్రమంగా ఒకరిపై ఒకరు పగ తీర్చుకునే సైకో అబ్సెషన్గా మారుతుంది. ఈ క్రమంలో జరిగే పరిణామాలు, అనుమానాస్పద నేరాలు ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసేలా స్క్రీన్ప్లే డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో క్యారెక్టర్ కోసం మేకర్స్ వెతుకుతున్నారని టాక్.
కెరీర్ లకు కీలకం
ఇద్దరు హీరోయిన్ ల కెరీర్ కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారనుంది. టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకెళ్లిన శ్రీలీల.. బాలీవుడ్ లోనూ అదరగొట్టాలని చూస్తోంది. నటనకు విపరీతమైన స్కోప్ ఉన్న ఈ డార్క్ థ్రిల్లర్ ఆమె హిందీ మార్కెట్ పునాదిని బలపరచనుందని అంటున్నారు. అందుకే ఈ మూవీ కోసం ఆమె స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టనుందని తెలిసింది.
{{/usCountry}}ఇద్దరు హీరోయిన్ ల కెరీర్ కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారనుంది. టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకెళ్లిన శ్రీలీల.. బాలీవుడ్ లోనూ అదరగొట్టాలని చూస్తోంది. నటనకు విపరీతమైన స్కోప్ ఉన్న ఈ డార్క్ థ్రిల్లర్ ఆమె హిందీ మార్కెట్ పునాదిని బలపరచనుందని అంటున్నారు. అందుకే ఈ మూవీ కోసం ఆమె స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టనుందని తెలిసింది.
{{/usCountry}}మరోవైపు 'పెద్ది' సినిమాలో తన పాత్రపై సాగిన చర్చల తర్వాత, ప్రస్తుతం టైగర్ ష్రాఫ్తో 'లగ్ జా గలే' చేస్తున్న జాన్వీ కపూర్కు కూడా ఇది సరైన ఇమేజ్ మేకోవర్ ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 అక్టోబర్ లేదా నవంబర్ నెలలో షూటింగ్ను పట్టాలెక్కించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.